News May 29, 2024
రామతీర్థానికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయం
రామతీర్థం దేవస్థానానికి హుండీల ద్వారా రూ.27.36 లక్షలు ఆదాయం వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారిణి పీవీ.లక్ష్మి తెలిపారు. ఆమె పర్యవేక్షణలో గురువారం హుండీలు లెక్కించారు. మార్చి 11 నుంచి మే నెల 28 వరకు గల ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వాహణ అధికారి వై.శ్రీనివాసరావు వెల్లడించారు.
Similar News
News October 8, 2024
విజయనగరంలో సుద్దాల అశోక్ తేజ పర్యటన
అమ్మ వంటి మాతృభాషను గౌరవించుకోవాలని, తెలుగు భాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పరిపాలన అధికారి డాక్టర్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
News October 8, 2024
VZM: యథావిధిగా డీఎంయూ, రాయ్పూర్ పాసింజర్లు
విశాఖ-రాయపూర్, విశాఖ-కోరాపుట్ లింక్ చేసిన విషయం విదితమే. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా లింకును రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ-రాయపూర్ పాసింజర్ గతంలో వచ్చిన మాదిరిగానే విశాఖపట్నంలో వేకువజామును 4.25 గంటలకు బయలుదేరుతుంది. విశాఖ-కొరాపుట్ పాసింజర్ విశాఖలో ఉదయం 6:30కి బయలుదేరుతుంది. ఈనెల 20 నుంచి ఈ సర్వీసులు ప్రారంభిస్తారు. >Share it
News October 8, 2024
విజయనగరం: మద్యం షాపులకు దరఖాస్తుల వెల్లువ
విజయనగరం జిల్లాలో ప్రైవేట్ మద్యం షాపులకు దరఖాస్తుల తాకిడి పెరిగింది. జిల్లాలో 153 దుకాణాలు నోటిఫై చేయగా, వాటికి రాష్ట్రంలోనే అత్యధికంగా 1,689 దరఖాస్తులు పడ్డాయి. ఆ విధంగా దరఖాస్తు ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. రేపు సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగియనుంది. దీంతో ఈ రెండు రోజుల్లో భారీగా దరఖాస్తులు పడే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.