News February 25, 2025
రామప్పకు మినీ హాఫ్ డే టూర్.. ఏసీ కోచ్లో జర్నీ

మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ – హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి రామప్ప ఆలయం వరకు 18 సీట్ల ఏసీ మినీ కోచ్ హాఫ్ డే టూర్లను నిర్వహిస్తున్నట్లు టీజీటీడీసీ డిప్యూటీ మేనేజర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6.45 గంటల వరకు ఉంటుందన్నారు.
Similar News
News February 25, 2025
10% సీట్లు లేకపోయినా ప్రతిపక్ష హోదా.. ‘ఢిల్లీ’ ఓ ఉదాహరణ

APలో ప్రధాన ప్రతిపక్ష హోదా అంశం హాట్టాపిక్గా మారింది. YCPకి 10% సీట్లు(18) లేనందున తాము ఆ హోదా కల్పించబోమని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏకైక ప్రతిపక్ష పార్టీకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వొచ్చని ‘ఢిల్లీ’ని ఉదాహరణగా వైసీపీ చూపిస్తోంది. 2015లో 70 సీట్లకుగాను ఆప్ 67 స్థానాలు, బీజేపీ 3 చోట్ల గెలిచింది. 10% సీట్లు(7) లేకపోయినా స్పీకర్ రామ్ నివాస్ BJP నేత విజేందర్ గుప్తాను ప్రతిపక్ష నేతగా గుర్తించారు.
News February 25, 2025
వైసీపీ పాలనలో ఉపాధ్యాయులకు అవమానం: గంటా

గత వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పెట్టి అవమానించిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గెలిపించాలన్నారు. పదవిని కాపాడుకోవడానికే జగన్ అసెంబ్లీకి వచ్చారని, తాము గేట్లు తెరిస్తే వైసీపీ నుంచి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు.
News February 25, 2025
తొలిరోజు ముగిసిన వంశీ కస్టడీ

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ తొలిరోజు ముగిసింది. రెండున్నర గంటల పాటు పోలీసులు ఆయన్ను పలు అంశాలపై విచారించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఎవరి ఆదేశాలతో చేయించారు? ఎందుకు చేయించారు? సత్యవర్ధన్ స్టేట్మెంట్పైనా మరికొన్ని ప్రశ్నలను పోలీసులు సంధించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం వంశీని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఆ తర్వాత జిల్లా జైలులో విడిచిపెట్టనున్నారు.