News February 25, 2025
రామప్పకు మినీ హాఫ్ డే టూర్.. ఏసీ కోచ్లో జర్నీ

మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ – హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి రామప్ప ఆలయం వరకు 18 సీట్ల ఏసీ మినీ కోచ్ హాఫ్ డే టూర్లను నిర్వహిస్తున్నట్లు టీజీటీడీసీ డిప్యూటీ మేనేజర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6.45 గంటల వరకు ఉంటుందన్నారు.
Similar News
News October 26, 2025
JNTU: OTPRIలో 31న ప్రాంగణ నియామకాలు

అనంతపురం జేఎన్టీయూ OTPRIలో ఈ నెల 31న ఉదయం 9:00 గంటలకు B.Pharm, M.Pharm విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నట్లు OTPRI డైరెక్టర్ సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ సి.గోపినాథ్ ఆదివారం తెలిపారు. 2022-25లో గ్రాడ్యుయేషన్ (B.Pharm, M.Pharm) పూర్తి చేసుకునే విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.
News October 26, 2025
మూడు జిల్లాల కలెక్టర్లకు మంత్రి కొండపల్లి ఫోన్

మోంథా తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, గాలులు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఫోన్ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. తుఫాను ప్రభావం కారణంగా ఏ పరిస్థితి వచ్చినా.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 26, 2025
GWL: కురుమూర్తి జాతరకు స్పెషల్ బస్సులు-DM

మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి రాయుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 28, 29 తేదీల్లో గద్వాల డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సునీత ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి ట్రిప్పు గద్వాల నుంచి బయలుదేరి అనంతరం ఆత్మకూరు నుంచి కురుమూర్తి వరకు అవసరమైనన్ని ట్రిప్పులు నడుస్తాయన్నారు. భక్తులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.


