News March 5, 2025

రామప్ప: ఈ బావి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

image

వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల రామప్ప ఆలయ ఆవరణలో ఉన్న కాకతీయుల కాలంనాటి బావి నేటి వరకు చెక్కుచెదరకుండా ఉంది. సుమారు 800 ఏళ్ల క్రితం తవ్విన ఈ బావి గోడలు పొడవైన, వెడల్పైన శిలలతో నిర్మించారు. ఈ బావిలోని నీటిని తాగితే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. రామప్ప ఆలయ నిర్మాణానికి వాడిన ఇటుకలు ఈ నీటిలో వేస్తే తేలుతాయి. రామప్ప సందర్శించిన పర్యాటకులు ఈ బావిని చూసి మంత్రముగ్ధులవుతారు.

Similar News

News November 15, 2025

మావోయిస్టు కొయ్యాడ సాంబయ్య లొంగుబాటు.?

image

మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన కొయ్యడ సాంబయ్య@ గోపన్న లొంగిపోయినట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకు చెందిన సాంబయ్య 4 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఇటీవల నేతలు వరస లొంగుబాట్లకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఆయన అజ్ఞాతం వీడి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం సాంబయ్య భద్రాద్రి, అల్లూరి డివిజన్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

News November 15, 2025

వరంగల్‌: ట్రాఫిక్ తనిఖీలతో ప్రజలకు ఇబ్బందులు..?

image

WGL ట్రాఫిక్ పోలీసులు కొత్త విధానంలో ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపివేస్తూ తనిఖీలు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అత్యవసర ప్రయాణాలు కూడా నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. NSPT ప్రధాన రహదారిపై రామ్‌ కీ ఎదురుగా ఆకస్మికంగా వాహనాలు ఆపేయడం వల్ల డ్రైవర్లు ఒక్కసారిగా అయోమయానికి గురై, సమస్య ఉన్న ప్రాంతాల్లో కాకుండా అవసరం లేని చోట్ల నియంత్రణ చేయడంపై విమర్శలు చేస్తున్నారు.

News November 15, 2025

సతీశ్ మృతి.. హత్యగా నిర్ధారిస్తూ కేసు నమోదు.!

image

TTD మాజీ ఏవీఎస్ఓ సతీశ్ కుమార్ <<18292217>>మృతి<<>>ని హత్యగా నిర్ధారిస్తూ గుత్తి జీఆర్పీ పీఎస్‌లో కేసు నమోదైంది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నం.75/2025గా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్ కుమార్ TTD పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఈనెల 6న CID విచారణకు వెళ్లిన ఆయన.. నిన్న మరోసారి విచారణకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.