News September 23, 2024
రామప్ప దేవాలయం సమీపంలో గుప్తనిధుల తవ్వకం

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పక్కనున్న గొల్లగుడిలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు స్థానికులు గుర్తించారు. గుడి పైకప్పు ధ్వంసం చేసి, లోపల తవ్వకాలు చేపట్టి, శిల్పాలను కూడా ధ్వంసం చేశారు. గుడి వద్ద దుండగులు ఉపయోగించిన నిచ్చెనతో పాటు పలు వస్తువులు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న పురావస్తు శాఖ అధికారులు వెంకటాపురం ఠాణాలో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 18, 2025
వరంగల్: ‘స్థానిక పోరు’పై మళ్లీ మొదలైన ఆసక్తి

స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గ్రామాల్లో మళ్లీ ఎన్నిక కోలాహలం అంతర్గతంగా మొదలైంది. వరంగల్ జిల్లాలో ఆశావహులు ఎన్నికల్లో పోటీపై మరోసారి చర్చలు ప్రారంభించారు. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయాలా..? వద్దా..? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఎన్నికల హడావుడి తిరిగి మొదలైంది. వరంగల్ జిల్లాలో 317 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలున్నాయి.
News November 18, 2025
వరంగల్: ‘స్థానిక పోరు’పై మళ్లీ మొదలైన ఆసక్తి

స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో గ్రామాల్లో మళ్లీ ఎన్నిక కోలాహలం అంతర్గతంగా మొదలైంది. వరంగల్ జిల్లాలో ఆశావహులు ఎన్నికల్లో పోటీపై మరోసారి చర్చలు ప్రారంభించారు. రిజర్వేషన్లు మారనున్న నేపథ్యంలో పోటీ చేయాలా..? వద్దా..? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఎన్నికల హడావుడి తిరిగి మొదలైంది. వరంగల్ జిల్లాలో 317 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలున్నాయి.
News November 17, 2025
వరంగల్: ‘గురుకుల పాఠశాల కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలి’

వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలకు భోజన సరఫరా చేసే క్యాటరింగ్ కాంట్రాక్టర్లు, తమ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకొని రేట్లను సవరించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారానికి వినతిపత్రం అందజేశారు. గత నాలుగు నెలలుగా బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరావు తెలిపారు.


