News February 26, 2025
రామప్ప శివపార్వతుల కళ్యాణానికి మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ములుగులోని రామప్పలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు అందించనున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి, అనంతరం పలు దేవాలయాల్లో జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు హాజరుకావాలని కోరారు.
Similar News
News February 26, 2025
NZB: శివాలయానికి వెళ్లొచ్చే సరికి మూడిళ్లలో చోరీ

శివరాత్రికి దేవాలయాలకు వెళ్లి వచ్చే సరికి అగంతకులు తాళం వేసిన మూడిళ్లలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గంగస్థాన్ నుంచి కేశాపూర్ వెళ్ళేదారిలో రియల్టర్ బలరాం రెడ్డి ఇంట్లో 25 తులాల బంగారం, ఆర్టీసీ కాలనీలోని రవీందర్ ఇంట్లో 2 తులాల బంగారం, ఏక శిలా నగర్లోని పెద్దమ్మ గుడి సమీపంలోని కిరాణ వ్యాపారి రవీందర్ ఇంట్లో రూ.60 వేల నగదును అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 26, 2025
పాలకుర్తి: ఘనంగా శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకుల వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, ఆలయ ఈవో మోహన్ బాబు, ప్రజాప్రతినిధులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News February 26, 2025
విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ విశాఖ జిల్లా వ్యాప్తంగా మార్మోగిన శివనామస్మరణ
➤ రేపు 13 కేంద్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
➤ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని పాఠశాలలకు సెలవు
➤ త్వరలో విశాఖ మెట్రో పనులు ప్రారంభం?
➤ మల్కాపురానికి చెందిన 22 ఏళ్ల యువకుడు మృతి
➤ ఆర్.కే, అప్పికొండ, భీమిలి బీచ్లలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేసిన అధికారులు