News April 10, 2024

రామభద్రపురం: నిన్న టీడీపీ లోకి… నేడు వైసీపీ లోకి

image

మండల పరిధిలోని ఆరికతోట గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు మాజీ సర్పంచ్‌ పెంకి భీమయ్య ఆధ్వర్యంలో వైసీపీలో చేరాయి. స్థానిక మండల వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వ్యక్తులు మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేసి కండువాలు వేయించి పార్టీలో చేర్చారని చెప్పారు.

Similar News

News March 14, 2026

పదో తరగతి కేంద్రాల వద్ద 144 సెక్షన్: VZM కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు మొత్తం 119 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, 564 మంది ప్రైవేట్ విద్యార్థులు, 631 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, ‘నో ఫోన్ జోన్’ అమల్లో ఉంటుంది. విద్యార్థులు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు.

News March 14, 2026

కొత్తవలస: యాక్సిడెంట్.. లారీ డ్రైవర్ మృతి

image

కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వే సైడింగ్ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఎల్.కోట మండలంలో ఓ కంపెనీకి చెందిన లారీ డ్రైవరు బొగ్గు లోడింగ్ కోసం కంటకాపల్లి రైల్వే సైడింగ్‌కు వచ్చాడు. లారీ డ్రైవరు లారీకి టార్పాలిన్ కడుతూ ఉండగా జారిపోయి పడిపోయాడు. ఆ సమయంలో అటుగా మరోలారీ రావడంతో ఆ లారీ కిందపడి మృతి చెందాడు.

News March 14, 2026

VZM: సురక్షిత ఉత్పత్తులే లక్ష్యం.. మోసపోతే ప్రశ్నించండి

image

వినియోగదారులు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు శ్రీదేవి అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ప్రతి వినియోగదారుడికి రక్షణ, సమాచారం, ఎంపిక, ఫిర్యాదు చేసే హక్కులు ఉన్నాయన్నారు. ఈ ఏడాది ‘సురక్షిత ఉత్పత్తులు – నమ్మకమైన వినియోగదారులు’ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.