News February 5, 2025

రామయ్యపట్నం గురించి రాజ్యసభలో ప్రశ్నించిన ఎంపీ బీద

image

రామయ్యపట్నం లో ఏర్పాటు చేయబోయే బీపీసీఎల్ రిఫైనరీ మీద రాజ్యసభలో మంగళవారం ఎంపీ బీద మస్తాన్ రావు ప్రశ్నించారు. దీనికి కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ మంత్రి అనుప్రియ పటేల్ సమాధానమిస్తూ ప్రాజెక్టు వ్యయం 96,862 కోట్ల రూపాయలని, ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 6000 ఎకరాల భూమిలో నెల్లూరు జిల్లా రామయ్యపట్నం ఓడరేవులు గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు అంగీకరించబడింది తెలిపారు

Similar News

News December 4, 2025

కండలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్

image

దిత్వా తుఫాను నేపథ్యంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కండలేరు జలాశయాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం పరిశీలించారు. ప్రస్తుతం 60 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని ఎస్.ఈ.సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని నిరంతరం పర్యవేక్షించి, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమీప గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

News December 4, 2025

నెల్లూరులో 5,198 మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ నమోదు..!

image

లోక్ సభలో నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి AP, నెల్లూరులో SHG కింద ఉన్న మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌‌పై ప్రశ్నించారు. MSME పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరండ్లాజే మాట్లాడుతూ.. MSME పరిశ్రమల రిజిస్ట్రేషన్‌‌కు ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను 1జులై2020న ప్రారంభించామన్నారు. అప్పటి నుంచి మైక్రో ఎంటర్‌ ప్రైజెస్‌ 30 నవంబర్ 2025 నాటికి APలో SHGల తరఫున 1,30,171, నెల్లూరులో 5,198 నమోదయ్యాయన్నారు.

News December 4, 2025

నెల్లూరు: వీఆర్సీ అండర్ బ్రిడ్జ్ వద్ద రాకపోకలు బంద్

image

వీఆర్‌సీ అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలబడడంతో ఆ ప్రాంతంలో అధికారులు రాకపోకలను నిషేధించారు. ఇటీవల ఈ అండర్ బ్రిడ్జి రిపేర్లు చేసిన విషయం తెలిసిందే. సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ నీళ్లు నిలబడడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో వాహనాలను అనుమతించడం లేదు. దీనివల్ల ప్రజలు కిలోమీటర్ తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది.