News April 19, 2024

రామసముద్రం: కూలీల ఆటోను ఢీకొన్న కారు

image

రామసముద్రం మండలంలో కారు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో 14మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. రామసముద్రం ఎస్సై చంద్రశేఖర్ కథనం.. సింగిరిగుంటకు చెందిన కూలీల ఆటోలో రామసముద్రం మండలం, మినికికు కూలి పనులు చేయడానికి బయలుదేరారు. మినికి వద్ద ఆటోను వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 22, 2025

బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని 12 మేకల మృతి

image

బంగారుపాళ్యం మండలం గుండ్ల కట్టమంచి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి చెందాయి. యజమాని వివరాలు మేరకు.. బెంగళూర్- చెన్నై జాతీయ రహదారిపై మేకల రోడ్డు దాటే సమయంలో గుర్తు తెలియని కంటైనర్ ఢీకొనడంతో 12 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయని తెలిపారు. బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News October 22, 2025

చిత్తూరు జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు సెలవు

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పాఠశాలలకు గురువారం కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్టు డీఈఓ వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఆదేశాలను పాటించాలని కోరారు.

News October 22, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాస్థాయి అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి, ప్రమాదకర చెరువుల పరిస్థితిపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, వైద్య అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.