News April 16, 2025
రామాయంపేటలో వడదెబ్బతో వృద్ధుడి మృతి

వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రామాయంపేట పట్టణానికి చెందిన ఎరుకల బాలయ్య(82) కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం కూడా పనికి వెళ్లారు. తిరిగి వచ్చిన ఆయన నీరసంగా ఉందని ఇంట్లోనే ఉన్నాడు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News November 26, 2025
మెదక్: ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధం: కలెక్టర్

మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పాపన్నపేట, టేక్మాల్ ఎంపీపీ కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. మొదటి విడతలో 160 గ్రామపంచాయతీలో 142 వార్డు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 27న ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచాలన్నారు.
News November 26, 2025
మెదక్: ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధం: కలెక్టర్

మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పాపన్నపేట, టేక్మాల్ ఎంపీపీ కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. మొదటి విడతలో 160 గ్రామపంచాయతీలో 142 వార్డు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 27న ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచాలన్నారు.
News November 26, 2025
మెదక్: డైట్ ప్రిన్సిపల్గా ప్రొ.రాధాకిషన్

మెదక్ డైట్ ప్రిన్సిపల్గా తెలంగాణ హైదరాబాద్లోని SCERT ప్రొ.డి.రాధా కిషన్కు బాధ్యతలు ఇస్తూ విద్యా శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రిన్సిపల్గా జిల్లా విద్యా శాఖాధికారి విజయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పక్షం రోజుల క్రితం వరకు ప్రొ.రాధాకిషన్ డీఈఓ, డైట్ ప్రిన్సిపల్గా పనిచేసి సెలవుపై వెళ్లారు.


