News February 21, 2025
రామారెడ్డి: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

8 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రామారెడ్డి మండలంలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్ఐ నరేశ్ వివరాలిలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన గుజ్జుల నవీన్ అదే గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికకు మొబైల్పై ఉన్న ఇష్టాన్ని అవకాశంగా చేసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News November 22, 2025
శ్రీకాకుళం నుంచి ప్రశాంతి నిలయానికి ప్రత్యేక రైలు

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) నుంచి ప్రశాంతి నిలయయానికి ప్రత్యేక రైలును శుక్రవారం శ్రీ సత్యసాయి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు ప్రారంభించారు. ప్రత్యేక ట్రైన్లో సుమారు 1,400 భక్తులతో ప్రయాణమైందని ఆయన తెలిపారు. ఈనెల 23వ తేదీన ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వందల పుట్టినరోజు సందర్భంగా ఈ రైలును ఏర్పాటు చేశామన్నారు.
News November 22, 2025
26న ‘స్టూడెంట్ అసెంబ్లీ’.. వీక్షించనున్న సీఎం

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న అసెంబ్లీ ఆవరణలో ‘స్టూడెంట్ అసెంబ్లీ’ నిర్వహించనున్నారు. ఇందుకోసం 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. కొందరు స్పీకర్, Dy.స్పీకర్, CM, ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారు. మిగతా విద్యార్థులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తారు. రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని CM CBN, మంత్రులు వీక్షించనున్నారు.
News November 22, 2025
జనగామ: వైద్య ఆరోగ్య శాఖలో 7 ఎంఎల్హెచ్పీ పోస్టులు

జనగామ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 7 ఎంఎల్హెచ్పీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి 29, 2025 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుము రూ. 500గా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులను సంబంధిత నిబంధనల మేరకు ఎంపిక చేయనున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దరఖాస్తులను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల వరకు పరిశీలిస్తారు.


