News December 6, 2024

రామాలయం అభివృద్ధికి రూ.63 కోట్లు: ఎమ్మెల్యే తెల్లం

image

భద్రాద్రి రామాలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.63 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తెలిపారు. అటు ఇప్పటికే దీనికి సంబంధించి భూసేకరణ పనులు జరుగుతున్నాయని గురువారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై నాయకులు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Similar News

News January 17, 2025

భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కవచాలంకరణ

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం స్వర్ణ కవచాలంకరణ నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, అభిషేకం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా చేశారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News January 17, 2025

KMM: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

image

కూసుమంచి హైస్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ మండల కేంద్రానికి చెందిన విజయ్ హఠాత్తుగా కుప్పకూలి పోయాడని స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమై హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించాడని, గుండెపోటే కారణమని వైద్యులు నిర్ధారించారు. తమతో ఆడుతూ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా హఠాన్మరణం చెందడంతో మిత్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు.

News January 17, 2025

ఖమ్మం: వైరా సబ్ రిజిస్ట్రార్‌పై సస్పెన్షన్ వేటు

image

ఖమ్మం జిల్లా వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ రామచంద్రయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేయడంపై విమర్శలు వచ్చాయి. జీపీఏ చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండానే ప్లాట్ల యజమానులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం.. ఎల్‌ఆర్‌ఎస్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం, 10 పాట్లు డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం చర్చనీయాంశం కావడంతో అధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు.