News March 24, 2025
రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ వస్తారు: మంత్రి

ఏప్రిల్ 7న జరిగే శ్రీ రామనవమి మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని, ఈసారి అంచనాకు మించి భక్తులు కూడా ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉందని కావున ఎవరికీ అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నవమి ఏర్పాట్లపై ఎంపీ బలరాం, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, పీవో రాహుల్ తో కలిసి సమీక్షా జరిపారు.
Similar News
News December 9, 2025
32,479 సంఘాలకు రుణం ఇవ్వాలి: బాపట్ల కలెక్టర్

పొదుపు మహిళలు జిల్లాలో అధికంగా ఉన్నందున 32,479 సంఘాలకు రుణం ఇవ్వాలని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం చెప్పారు. 10,957 సంఘాలకు రుణాలు మంజూరు కాగా, ప్రస్తుతం 3,979 సంఘాలకు మాత్రమే రూ.604.02 కోట్ల రుణాలు ఇవ్వడం ఏమిటని ఆరా తీశారు. పొదుపు మహిళలకు అధికంగా రుణ సదుపాయం కల్పించాల్సి ఉండగా, ఆశించిన స్థాయిలో రుణాలు ఇవ్వకపోవడపై ధ్వజమెత్తారు.
News December 9, 2025
NGKL: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఏఈ

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల ఇన్చార్జి ఏఈ వెంకటేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు. చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన రైతు వద్ద రూ.20 వేలు డిమాండ్ చేసి, రూ.15 వేలు తీసుకుంటుండగా అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. కల్వకుర్తి ప్రాంతంలో వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా అధికారుల తీరులో మార్పు రావడం లేదని స్పష్టమవుతోంది.
News December 9, 2025
కామారెడ్డి: మరికాసేపట్లో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర

కామారెడ్డి జిల్లాలోని మొదటి విడత ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగియనుంది. కామారెడ్డి, రామారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్, భిక్నూర్, బీబీపేట, దోమకొండ, రాజంపేట, మాచారెడ్డి, పల్వంచ మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, పలు పార్టీల మద్దతుదారులు, నవతరం యువత వినూత్న పద్ధతుల్లో, విస్తృతంగా ప్రచారం చేశారు. సాయంత్రం 6గం.లకు ప్రచారానికి ఇక తెర పడనుంది.


