News March 24, 2025
రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ వస్తారు: మంత్రి

ఏప్రిల్ 7న జరిగే శ్రీ రామనవమి మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని, ఈసారి అంచనాకు మించి భక్తులు కూడా ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉందని కావున ఎవరికీ అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నవమి ఏర్పాట్లపై ఎంపీ బలరాం, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, పీవో రాహుల్ తో కలిసి సమీక్షా జరిపారు.
Similar News
News January 1, 2026
WNP: త్వరలోనే ల్యాబ్ టెక్నీషియన్ల నియామక పత్రాలు- చిన్నారెడ్డి

రాష్ట్రంలోని ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల అభ్యర్థులు గురువారం హైదరాబాద్ ప్రజా భవన్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఇన్ఛార్జ్ డాక్టర్ చిన్నారెడ్డిని కలిశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలోపే తమకు నియామక పత్రాలు అందజేయాలని వినతిపత్రం అందజేశారు. అభ్యర్థుల సమస్యలను విన్న ఆయన తక్షణమే సీఎంఓ అధికారి శేషాద్రితో ఫోన్లో మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన నియామక పత్రాలు అందజేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
News January 1, 2026
కొత్త సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ దాడి.. 24 మంది మృతి

రష్యా నియంత్రణలోని ఖేర్సన్లో నూతన సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఖోర్లీలోని ఒక హోటల్, కేఫ్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 24 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే నిప్పు అంటుకునే రసాయనాలతో ఈ దాడులు చేశారని, అర్ధరాత్రి వేళ పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదని ఆయన పేర్కొన్నారు.
News January 1, 2026
ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్లో ఉద్యోగాలు

<


