News April 4, 2025
రాములోరి కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు: భద్రాద్రి ఎస్పీ

ఈనెల 6, 7 తేదీల్లో భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవానికి ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పార్కింగ్ స్థలాలు, కళ్యాణ మంటపం, సెక్టార్లు, లడ్డూ, తలంబ్రాల కౌంటర్ వద్దకు సులభంగా వెళ్లేందుకు QR కోడ్, ఆన్లైన్ లింక్ రూపొందించినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
జిల్లాకు ‘ప్రకాశం’ అని నామకరణం చేసింది ఈ రోజే!

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!
News December 5, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 60 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 60 కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్లో 33, సెంట్రల్ జోన్లో 19, వెస్ట్ జోన్లో 3, ఈస్ట్ జోన్లో 2 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
News December 5, 2025
MBNR: యువకులకు ఉచిత శిక్షణ.. ఫోన్ చేయండి

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గ్రామీణ యువకులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’కు తెలిపారు. బైక్ మెకానిక్, సెల్ఫోన్ కోర్సులలో ఈనెల 23 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు. 19-45లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 22లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 98481 42489 సంప్రదించాలన్నారు. #SHARE IT.


