News April 1, 2025
రాయచోటిలో అర్ధరాత్రి నడి రోడ్డుపై కొట్టుకున్న యువకులు

అన్నమయ్య జిల్లాలో ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి నడి రోడ్డుపై కొట్టుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి రాయచోటిలోని మదనపల్లె రోడ్డు శివాలయం సమీపంలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు గాయపడటంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 15, 2025
ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, సిద్దిపేటలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇతర చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. నిన్న రాత్రి హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచి కొట్టిన సంగతి తెలిసిందే.
News September 15, 2025
సుప్రీంకోర్టులో కోర్టు మాస్టర్ ఉద్యోగాలు

<
News September 15, 2025
మంచిర్యాలలో వందే భారత్ హాల్ట్ ప్రారంభం

మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు అదనపు స్టాప్ను ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈ రైలు కాజీపేట్, రామగుండం, బల్లార్షా, సేవాగ్రామ్, చంద్రపూర్ స్టేషన్లను కలుపుతుంది. ఈ కొత్త హాల్ట్తో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, వ్యాపారం, వాణిజ్యం కూడా వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నారు.