News April 1, 2025

రాయచోటిలో అర్ధరాత్రి నడి రోడ్డుపై కొట్టుకున్న యువకులు

image

అన్నమయ్య జిల్లాలో ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి నడి రోడ్డుపై కొట్టుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి రాయచోటిలోని మదనపల్లె రోడ్డు శివాలయం సమీపంలో జరిగింది. ఇద్దరు వ్యక్తులు గాయపడటంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 20, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.1,24,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,14,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 20, 2025

గ్రేటర్ వైపు.. గులాబీ దళం చూపు

image

జూబ్లీహిల్స్ ఎన్నిక ముగిశాక BRS నాయకులు విశ్రాంతి తీసుకోవడం లేదు. నాయకులు, కార్యకర్తలకు KTR బుధవారం దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి సత్తా తమ ఏంటో చూపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపఎన్నిక ఓటమి తర్వాత KTR కార్యకర్తల్లో ఉత్సాహం నింపే యత్నం చేస్తున్నారు. గతంలో గ్రేటర్ పీఠం BRSకు దక్కింది.. ఇప్పుడూ మనమే దక్కించుకుందామని పేర్కొన్నారు. GHMCలో ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.

News November 20, 2025

MBNR: U-17, 19.. రేపు సాఫ్ట్ బాల్ ఎంపికలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17, 19 బాల బాలికలకు సాఫ్ట్ బాల్ జట్ల ఎంపికలను ఈనెల 21న మహబూబ్‌నగర్‌లోని స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 20న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, సొంత గ్లాజ్‌లు తీసుకొని ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు 99592 20075, 99590 16610 సంప్రదించాలన్నారు.