News April 10, 2025
రాయచోటిలో గ్యాంగ్ వార్.. 9 మంది అరెస్ట్

రాయచోటిలో జరిగిన గ్యాంగ్ వార్ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పరారీలో వున్న మరో 15 మంది నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుల నుంచి 5 కట్టెలు, 3ఇనుప రాడ్లు, ఒక చైను, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలో10రోజుల క్రితం శివాలయం వద్ద ఇరు వర్గాలు ఘర్షణకు పాల్పడిన సంగతి తెలిసిందే.
Similar News
News December 4, 2025
మూడో దశ.. తొలిరోజు 141 నామినేషన్లు

జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదటి రోజు 141 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఐదు మండలాల్లోని 87 గ్రామ పంచాయతీలకు 141 నామినేషన్లు రాగా, 762 వార్డు స్థానాలకు కోసం 245 నామినేషన్లు అందినట్లు అధికారులు తెలిపారు. మూడో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురు, శుక్రవారాల వరకు కొనసాగనుంది.
News December 4, 2025
MDK: స్థానిక ఎన్నికలపై దృష్టి సారించిన మాజీ ఎమ్మెల్యే

రామాయంపేట మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలను పూర్తిగా కైవసం చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మండలంపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని గ్రామాలలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునే విధంగా పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే గెలుపొందే అభ్యర్థులను మద్దతు తెలుపుతూ ఇతరులు వైదొలగే విధంగా బుజ్జగిస్తున్నారు.
News December 4, 2025
వరంగల్: ఎన్నికల బరిలో తల్లీకూతుళ్లు

నల్లబెల్లి మండల కేంద్రంలోని ఐదో వార్డులో వార్డు మెంబర్గా తల్లీకూతుళ్లు బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. తల్లి జక్కోజు సరోజనని బీజేపీ బలపరచగా.. కూతురు ముషిక చైతన్యను బీఆర్ఎస్ బలపరిచింది. తల్లీకూతుళ్లు ఒకేసారి రాజకీయ రంగంలో నిలవడం గ్రామంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ప్రజల సమస్యలను నేరుగా అర్థం చేసుకుని పరిష్కరించాలనే సంకల్పంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని వారు పేర్కొన్నారు.


