News August 11, 2024

రాయచోటిలో పిచ్చికుక్కల దాడి.. 34 మందికి గాయాలు

image

జిల్లా కేంద్రమైన రాయచోటిలో శనివారం పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. కొత్తపేట, గాలివీడు రోడ్డు, బస్టాండ్ రోడ్డు, మాసాపేట ప్రాంతాలకు చెందిన 34 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన అహమదుల్లాను కడప రిమ్స్‌కు తరలించగా, వెంకటరమణ, పిచ్చమ్మ, ఇర్ఫాన్, రంగయ్య నాయుడు, కుళ్లాయప్ప, మనోహర్, ఆనంద్, బాబ్జి, ఖదీర్ బాష, అమృత, నాగేశ్వరమ్మ పలువురు గాయపడ్డారు.

Similar News

News November 21, 2025

కడప కలెక్టరేట్‌లో విశ్వవిద్యాలయాలపై సమీక్ష.!

image

కడప కలెక్టరేట్‌లో శుక్రవారం ఛైర్మన్ కూన రవి కుమార్ అధ్యక్షతన యోగివేమన యూనివర్సిటీ, ఇడుపులపాయ IIIT, హార్టికల్చర్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల పనితీరుపై పబ్లిక్ అండర్‌ టేకింగ్స్ కమిటీ (PUC) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు రామగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీల పనితీరు మరింత మెరుగుపడేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

News November 21, 2025

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి కడప SP సాయం

image

కడపలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన AR హెడ్ కానిస్టేబుల్ నారాయణ కుటుంబానికి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ రూ.2.5 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు. పోలీస్ సంక్షేమం కింద వితరణ నిధి నుంచి ఈ మొత్తాన్ని మృతుడి సతీమణి రమాదేవికి శుక్రవారం అందించారు. అంకితభావంతో పనిచేసే సిబ్బంది మరణం బాధాకరమని ఎస్పీ పేర్కొంటూ, కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

News November 21, 2025

ప్రొద్దుటూరులో బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్.!

image

పొద్దుటూరు పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.10.56 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠాలో కీలక వ్యక్తులైన ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ధనికల వీరశంకర్, కాశినాయన మండలానికి చెందిన ఆర్ల చంద్ర యాదవ్‌ను శుక్రవారం డీఎస్పీ భావన ఆధ్వర్యంలో సీఐ సదాశివయ్య అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు.