News March 8, 2025
రాయచోటి: ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

అన్నమయ్య జిల్లాలో శనివారం తెల్లవారుజామనున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కె.వి పల్లి మండలం, మహల్ క్రాస్ టర్నింగ్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు రాయచోటి నుంచి చెన్నైకి వెళ్తున్న సమయంలో పాల వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని డ్రైవర్ ఢిల్లీబాబు(33), టి.వెంకటేశ్ (23) మృతి చెందారు. మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు.
Similar News
News March 26, 2025
కడప: అనుమానంతో భార్యను చంపిన భర్త

వల్లూరు(M) అంబవరంలో భార్యను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. ఎర్రగుడిపాడుకు చెందిన చెన్నకేశవ, సుజాతకు పెళ్లై ముగ్గురు సంతానం. చెన్నకేశవ తాగుడుకు బానిసై భార్యపై అనుమానం పెంచుకొని వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. సుజాతను పెద్దకొడుకు పనినిమిత్తం అంబవరానికి పిలుచుకొచ్చాడు. మంగళవారం సుజాతపై చెన్నకేశవ కొడవలితో దాడి చేసి చంపాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 25, 2025
కడప: భార్యను చంపిన భర్త.. అనంతరం సూసైడ్

కడప జిల్లా వల్లూరు మండలంలో మంగళవారం దారుణ హత్య జరిగింది. అంబవరం ఎస్సీ కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఎర్రగుడిపాడు చెన్నకేశవ భార్య సుజాతను విచక్షణా రహితంగా కత్తితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం చెన్నకేశవ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కమలాపురం సీఐ రోషన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 25, 2025
కడప జడ్పీ ఎన్నికల్లో పోటీ చేయం: వాసు

త్వరలో జరగనున్న కడప జడ్పీ ఎన్నికపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఎన్నికల్లో పోటీచేయలేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి (వాసు) స్పష్టం చేశారు. తమ పార్టీకి సంఖ్యాబలం లేదని అందుకే పోటీ చేయడం లేదన్నారు. అటు చంద్రబాబు కూడా దీనిపై స్పష్టత ఇచ్చారన్నారు. కాగా కడపలో మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, వైసీపీకి 42, టీడీపీ6గా సంఖ్యా బలం ఉంది.