News April 14, 2025
రాయచోటి: పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో నేడు జరగాల్సిన పీజీఆర్ఎస్ రద్దయింది. బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి, ఫిర్యాదుల కోసం కార్యాలయానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 6, 2025
విశాఖ నుంచి వెళ్లవలసిన పలు విమానాలు రద్దు

విశాఖ నుండి వెళ్ళవలసిన పలు విమానాలు రద్దు అయినట్టు శనివారం ఉదయం ఇంచార్జి ఏర్పోర్ట్ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం తెలిపారు. వాటిలో ఇండిగో సంస్థకు చెందిన 6E 217 / 6E 218 BLR – VTZ – BLR, 6E 5248 / 6E 845 BOM – VTZ – MAA, 6E 557 / 6E 6585 MAA – VTZ – BOM ఆపరేషన్ రీజనల్ కారణంగా రద్దయినట్లు తెలిపారు. వీటితో పాటు మరో 9 విమానాలను రద్దు చేశారు.
News December 6, 2025
NZB: ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడండి: MP

ప్రభుత్వ టీచర్లకు తప్పని సరి అనే నిబంధనల విషయంలో చాలా ఏళ్లుగా సేవ చేస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ను MP అర్వింద్ ధర్మపురి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఒక వినతిపత్రం అందజేసిన ఎంపీ మాట్లాడుతూ NZBలోక్ సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు 3వేల మంది ఉపాధ్యాయులపై ఈ టెట్ తప్పనిసరి అంశం ప్రభావం చూపుతోందని వివరించారు.
News December 6, 2025
వికారాబాద్: గ్రామాల్లో మొదలైన బేరసారాలు..!

గ్రామాల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. అయితే రెండో విడతలో ఈరోజు విత్ డ్రా ఉండడంతో గ్రామాలలో బేర సారాలు గట్టిగానే నడుస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే విందులు వినోదాలు ఉత్సాహపరుస్తున్నారు. బేరసారాలు మాత్రం లక్షల్లో పలుకుతున్నట్లు సమాచారం. ఉప సర్పంచు పదవి ఆశిస్తున్న వారు తమ వార్డులో ప్రత్యర్థిగా నామినేషన్ వారితో సెటిల్మెంట్ ఆఫర్లు ఇస్తున్నారట. ఈరోజు ఎన్ని విత్ డ్రా లు అయితాయో చూడాలి.


