News February 12, 2025

రాయచోటి: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

image

భార్యను క్రూరంగా హత్యచేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ రాయచోటి 5వ అదనపు జిల్లా జడ్జి తీర్పిచ్చారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుట్టపల్లి ధనంజయ(31) తన భార్య లక్ష్మీదేవిని 2017 ఫిబ్రవరిలో హత్య చేశాడు. అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ని అరెస్టు చేశారు. కోర్టు పూర్వాపరాలను విచారించింది. నేరం రుజువు కావడంతో ధనంజయకు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం జడ్జి కృష్ణన్ కుట్టి తీర్పునిచ్చారు.

Similar News

News October 29, 2025

KNR: AIతో మార్ఫింగ్‌.. బాలికలపై లైంగిక వేధింపులు..!

image

గంగాధర మం. కురిక్యాల ZPHSలో బాలికలతో అటెండర్ దిగిన ఫొటోలను అతడు AIతో మార్ఫింగ్ చేసి విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ నిందితుడిని <<18125828>>సస్పెండ్<<>> కాకుండా మొత్తం సర్వీస్ నుంచి తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై POCSO ACTలోని సెక్షన్ 21 కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని CP తెలిపారు.

News October 29, 2025

బ్రెయిన్ స్ట్రోక్.. సత్వర వైద్యమే కీలకం

image

హైబీపీ, డయాబెటిస్, ఊబకాయం, ఒత్తిడి వల్ల మహిళల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని న్యూరాలజిస్ట్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ‘మొత్తం బాధితుల్లో 30-45 ఏళ్ల వయసున్న వారు 15% వరకు ఉంటున్నారు. సకాలంలో చికిత్స చేయిస్తేనే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు. ఒక్కసారిగా మైకం, చూపుపోవడం, ముఖం ఒకవైపు జారిపోవడం, అవయవాల బలహీనం, మాట అస్పష్టత దీని లక్షణాలు’ అని పేర్కొన్నారు.

News October 29, 2025

బ్రెయిన్ స్ట్రోక్ నిర్ధారణ, చికిత్స ఇలా

image

మస్తిష్క రక్తనాళాల్లో ఏర్పడే వైఫల్యంతో బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుందని న్యూరాలజిస్ట్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. CT స్కాన్, MRI, రక్త పరీక్షలు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్, కరోటిడ్ అల్ట్రాసౌండ్, సెరెబ్రల్ యాంజియోగ్రామ్ వంటి టెస్టుల ద్వారా స్ట్రోక్‌ను నిర్ధారిస్తారన్నారు. ఫిజియోథెరపీతో పాటు, యాంటీ ప్లేట్‌లెట్లు, యాంటీ కాగ్యులెంట్లు, స్టాటిన్లు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించవచ్చని పేర్కొన్నారు.