News January 30, 2025

రాయచోటి: మృతుడి పిల్లలకు రూ.లక్ష చెక్కు అందజేత

image

అధ్యాపకుడి పిల్లలకు రూ.లక్ష సాయాన్ని DRO మదన్ మోహనరావు బుధవారం రాయచోటిలో అందజేశారు. తంబళ్లపల్లె ఎకనామిక్స్ లెక్చరర్ వెంకటరమణ మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. కలెక్టరేట్లో DIEO కృష్ణయ్య, ప్రిన్సిపాల్ అమరేంద్ర తదితరులు లెక్చరర్ చనిపోయి పిల్లలు అనాధలైన విషయాన్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి విన్నవించారు. కలెక్టర్ రూ.లక్ష చెక్కు, మరో రూ.72వేలు అకౌంట్లో వేశారు.

Similar News

News November 17, 2025

యాదాద్రి: గ్రామ గ్రామాల్లో లక్ష్మీ నరసింహ కళ్యాణం: ఈవో

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుల కల్యాణం విదేశాల్లో తగ్గించి మారుమూల గ్రామాల్లోనూ నిర్వహిస్తామని దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు చెప్పారు. కొండపైన అధికారులు, అర్చక బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామీణుల అభ్యర్థన మేరకు స్వామి కల్యాణాలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ప్రచార రథాలను తక్షణమే అందుబాటులో తెస్తామన్నారు. గోశాలలో దామోదర కళ్యాణం సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News November 17, 2025

3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

image

ఐబీపీఎస్ <>RRB<<>> పీవో ప్రిలిమ్స్ 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచింది. RRB పీవో పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు www.ibps.in/ సైట్లో రిజిస్ట్రేషన్, రోల్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 3,928 పోస్టులకు ఈ నెల 22,23 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.

News November 17, 2025

ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (<>NIELIT<<>>) 4 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ, BE, B.Tech, M.Tech, MSc, CA, CMA/B.Com, M.Com ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 23వరకు అప్లై చేసుకోవచ్చు . దరఖాస్తు ఫీజు రూ.200. ఈ నెల 26న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.nielit.gov.in/