News January 30, 2025
రాయచోటి: మృతుడి పిల్లలకు రూ.లక్ష చెక్కు అందజేత

అధ్యాపకుడి పిల్లలకు రూ.లక్ష సాయాన్ని DRO మదన్ మోహనరావు బుధవారం రాయచోటిలో అందజేశారు. తంబళ్లపల్లె ఎకనామిక్స్ లెక్చరర్ వెంకటరమణ మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. కలెక్టరేట్లో DIEO కృష్ణయ్య, ప్రిన్సిపాల్ అమరేంద్ర తదితరులు లెక్చరర్ చనిపోయి పిల్లలు అనాధలైన విషయాన్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి విన్నవించారు. కలెక్టర్ రూ.లక్ష చెక్కు, మరో రూ.72వేలు అకౌంట్లో వేశారు.
Similar News
News December 7, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <
News December 7, 2025
సర్పంచ్గా ఎన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చో తెలుసా?

TG: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేయవచ్చు. అన్ని/ఏదో ఒక చోట గెలిస్తే ఒక స్థానాన్ని ఎంచుకుని, మిగతా చోట్ల రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో అలా కుదరదు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానంలో మాత్రమే పోటీ చేయడానికి పర్మిషన్ ఉంది. ఒకటి కంటే ఎక్కువ చోట్ల బరిలోకి దిగితే పోటీ చేసిన అన్ని చోట్లా అనర్హుడిగా ప్రకటిస్తారు.
Share It
News December 7, 2025
నూజివీడు: ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం

నూజివీడులో ట్రిపుల్ ఐటీలో చదువుతున్న బాలిక అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్టడీ క్లాస్ నుంచి హాస్టల్ కు వెళ్లవలసిన బాలిక కనిపించకపోవడంతో అంతా కంగారుపడ్డారు. బాలిక అదృశ్యంపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నూజివీడు పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


