News April 4, 2025
రాయచోటి : వాహనంపై స్టంట్ చేసిన యువకులపై కేసు

రాయచోటిలో స్కూటీపై వేగంగా, నిర్లక్ష్యంగా స్టంట్లు చేసిన ఇద్దరి యువకులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా వారికి వాహనం ఇచ్చిన యజమానిపైనా కేసు నమోదైంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు ఎవరూ బైక్స్ ఇవ్వొద్దని, వారు అతి వేగంగా ప్రయాణించి ప్రమాదం జరిగితే అది ఆ తల్లిదండ్రులకి బాధను కలిగిస్తుందని సూచించారు.
Similar News
News October 15, 2025
తాడికొండ: బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై కేసు

తాడికొండ మండలంలో 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసిన యువకుడిపై కేసు నమోదైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వంశీ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో బాలికకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 15, 2025
సత్తెనపల్లి: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ సస్పెండ్

సత్తెనపల్లి మండలంలోని ఫణిదం గ్రామంలో విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించిన జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు జరార్డ్ బాబుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఘటనపై తల్లిదండ్రులు, మహిళలు ఆగ్రహంతో ఉపాధ్యాయుడిని చితకబాదగా, గ్రామ పెద్దలు ఇటువంటి ఘటనలు మళ్లీ జరగరాదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై స్పందించిన డీఈఓ చంద్రకళ ఉపాధ్యాయుడు జరార్డ్ బాబును సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.
News October 15, 2025
సికింద్రాబాద్: సంతోషం.. ఇప్పటికైనా మేల్కొన్నారు!

రైళ్లల్లో రోజూ వేల మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఇది రైల్వే అధికారులకూ తెలుసు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక వ్యవస్థా ఉంది. అయితే ఎందుకో రైల్వే అధికారులు అసలు టికెట్ చెకింగ్ అనేదే చేయడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా మేల్కొన్న అధికారులు తనిఖీలు చేయాలని నిర్ణయించి ఒక్కరోజు (మంగళవారం)లోనే రూ.కోటి పాయలు వసూలు చేశారు. ముందు నుంచే ఈ పని చేసి ఉంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు.