News March 29, 2024

రాయచోటి: విద్యుదాఘాతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

చిన్నమండెం మండల పరిధిలోని పడమటికోన కమ్మపల్లెలో గురువారం విద్యుదాఘాతంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మట్లి మహేశ్ నాయుడు (30) మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. మహేశ్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా వర్క్ ఫ్రం హోంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన స్వగ్రామంలో ప్లగ్ బాక్స్‌లో పిన్ మారుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైనట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Similar News

News April 15, 2026

పోరుమామిళ్ల: ఇంటర్‌లో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

పోరుమామిళ్ల మండలానికి చెందిన విద్యార్థి ఇంటర్‌లో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు రిఫర్ చేశారు. డాక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థి తాగిన పాయిజన్ అత్యంత ప్రమాదకరమని, పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిపారు.

News April 15, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15.360
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,131
* 10 గ్రాముల వెండి ధర రూ.2,520.

News April 15, 2026

కడప జిల్లాలో సెకండ్ ఇంటర్ ఫలితాలు యజమాన్యాల వారీగా ఇలా.!

image

కడప జిల్లాలో సెకండ్ ఇంటర్ ఫలితాలు యజమాన్యాల వారీగా ఇలా ఉన్నాయి.
✎ 20 ప్రభుత్వ కాలేజీల్లో 2002 మందికి గాను.. 1131 (56%) మంది పాస్
✎ 5 ఎయిడెడ్‌ల్లో 290 మందిలో 73 (25%)
✎ 9 HSPLUSల్లో 145 మందిలో 75 (48%)
✎ 3 మోడల్ కాలేజీల నుంచి 200 మందిలో 132 (66%)
✎ 11 APSWRల్లో 581 మందిలో 497 (86%)
✎ 16 KGBVల నుంచి 477 మందిలో 379 (79%).
✎ 71 ప్రైవేట్ కాలేజీల నుంచి 10201 మందిలో 7588 (74%) మంది పాస్ అయ్యారు.