News December 22, 2024

రాయపర్తి SBIలో 19 కిలోల బంగారం చోరీ.. UPDATE

image

<<14659837>>రాయపర్తి ఎస్బీఐ<<>> బ్యాంకులో నవంబర్ 18న జరిగిన 19 కిలోల బంగారం చోరీ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. కాగా ఈ చోరీకి సంబంధించిన నిందితులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆ దొంగతనంలో భాగస్వాములైన వివిధ వ్యక్తుల నుంచి 9 కిలోలు సేకరించారు. మిగిలిన 10 కిలోల బంగారాన్ని దొరకబట్టే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. నిందితుల్లో ఒకరు నేపాల్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది.

Similar News

News April 11, 2026

వరంగల్: అంగన్వాడీ సేవలు స్మార్ట్ దిశగా.. 4జీ ఫోన్ల పంపిణీ

image

జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత స్మార్ట్‌గా మారనుంది. వర్ధన్నపేట, వరంగల్, నర్సంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 919 కేంద్రాల్లో సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం 4జీ సెల్‌ఫోన్లను అందిస్తోంది. మొత్తం 874 ఫోన్లు పంపిణీ చేయనుండగా, ఇప్పటి వరకు పాత 2జీ ఫోన్లతో ఎదురైన సాంకేతిక సమస్యలకు పరిష్కారం లభించనుంది.పోషణ్ ట్రాకర్ యాప్, ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు వంటి ప్రక్రియలు వేగవంతం అవుతాయి.

News April 11, 2026

పున్నెలు హత్య కేసు ఇచ్చిన భయానక సందేశం

image

హనుమకొండ జిల్లా పున్నెలు ఘటన ఈ సమాజానికి గంభీర హెచ్చరికగా నిలిచింది. కుమారుడు పుట్టాలనే మొండి అభిప్రాయం, లింగ వివక్ష, అక్రమ సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ కేసు స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశాయి. మహిళలపై వివక్షను నిర్మూలించడం, చట్టాలను కఠినంగా అమలు చేయడం, సమాజంలో అవగాహన పెంచడం అత్యవసరం. మీరేమంటారు?

News April 11, 2026

పున్నెలు హత్య కేసు ఇచ్చిన భయానక సందేశం

image

హనుమకొండ జిల్లా పున్నెలు ఘటన ఈ సమాజానికి గంభీర హెచ్చరికగా నిలిచింది. కుమారుడు పుట్టాలనే మొండి అభిప్రాయం, లింగ వివక్ష, అక్రమ సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ కేసు స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశాయి. మహిళలపై వివక్షను నిర్మూలించడం, చట్టాలను కఠినంగా అమలు చేయడం, సమాజంలో అవగాహన పెంచడం అత్యవసరం. మీరేమంటారు?