News December 22, 2024

రాయపర్తి SBIలో 19 కిలోల బంగారం చోరీ.. UPDATE

image

<<14659837>>రాయపర్తి ఎస్బీఐ<<>> బ్యాంకులో నవంబర్ 18న జరిగిన 19 కిలోల బంగారం చోరీ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. కాగా ఈ చోరీకి సంబంధించిన నిందితులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆ దొంగతనంలో భాగస్వాములైన వివిధ వ్యక్తుల నుంచి 9 కిలోలు సేకరించారు. మిగిలిన 10 కిలోల బంగారాన్ని దొరకబట్టే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. నిందితుల్లో ఒకరు నేపాల్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది.

Similar News

News January 20, 2025

ఈనెల 28న కొత్తకొండ హుండీల లెక్కింపు

image

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు. 

News January 19, 2025

భూపాలపల్లి: రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

రైతుభరోసా, నూతన రేషన్ కార్డులు విచారణ ప్రక్రియలో జిల్లా, మండలస్థాయి అధికారులు భాగస్వాములైనందున ఈనెల 20న (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ మేరకు ప్రజావాణి తాత్కాలిక రద్దుపై ఆదివారం ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి విచారణ, 21వ తేదీ నుంచి జరుగనున్న గ్రామసభల నిర్వహిస్తామన్నారు.

News January 19, 2025

భూపాలపల్లి: వెరిఫికేషన్ ప్రక్రియను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

image

రేగొండ మండలం లింగాల గ్రామం, గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేటలో జరుగుతున్న పథకాల సర్వే ప్రక్రియను భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ పకడ్బందీ, పారదర్శకంగా జరుగుతుందని అదనపు కలెక్టర్ తెలిపారు. రైతులు, పథకాల లబ్ధిదారులు ఈ ప్రక్రియ ద్వారా తమకు అందే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.