News December 22, 2024

రాయపర్తి SBIలో 19 కిలోల బంగారం చోరీ.. UPDATE

image

<<14659837>>రాయపర్తి ఎస్బీఐ<<>> బ్యాంకులో నవంబర్ 18న జరిగిన 19 కిలోల బంగారం చోరీ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. కాగా ఈ చోరీకి సంబంధించిన నిందితులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆ దొంగతనంలో భాగస్వాములైన వివిధ వ్యక్తుల నుంచి 9 కిలోలు సేకరించారు. మిగిలిన 10 కిలోల బంగారాన్ని దొరకబట్టే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. నిందితుల్లో ఒకరు నేపాల్‌కు పారిపోయినట్లు తెలుస్తోంది.

Similar News

News July 11, 2025

WGL: పెరిగిన మొక్కజొన్న, పసుపు ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటా గురువారం రూ.2,430 పలకగా.. ఈరోజు రూ.2,470 పలికింది. అలాగే పసుపు నిన్న
రూ.12,259 ధర రాగా నేడు రూ.12,459 ధర వచ్చింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.6,300 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,550 ధర వచ్చిందని అధికారులు తెలిపారు.

News July 11, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన ప్రగతి కనిపించాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో అన్ని మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల, రేషన్ కార్డుల వేరిఫికేషన్, భూ భారతి దరఖాస్తుల పరిస్కారం, వనమహోత్సవంలో నాటిన మొక్కలు, సీజనల్ వ్యాధులపై సమీక్షించారు.

News July 11, 2025

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై కలెక్టర్ సమీక్ష

image

ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం సమీక్ష నిర్వహించారు. పథకం అమలు, లబ్ధిదారుల శిక్షణ, ఆర్ధిక సహకారం, టూల్ కిట్ల పంపిణి తదితర అంశాలపై సమీక్షించారు. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.