News February 28, 2025

రాయపోల్: దీపం అంటుకొని ఇళ్లు దగ్ధం.. రోడ్డున పడిన కుటుంబం

image

విద్యుత్ ప్రమాదంలో పెంకుటిళ్లు దగ్ధమైన ఘటన రాయపోల్ మండలం పెద్దఆరేపల్లిలో రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కోంపల్లి శంకరయ్య భార్య లలితతో పాటు శివరాత్రి పండుగ సందర్భంగా రాత్రి ఇంట్లో దేవతలకు దీపం వెలిగించి ఇంటి బయట నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతోఇళ్లు పూర్తిగా కాలిపోయింది. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆదుకోవాలని స్థానికులు కోరారు.

Similar News

News November 17, 2025

MBNR: ముగిసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు

image

మహబూబ్‌నగర్ జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. స్వామివారి ఆభరణాలను ఎస్బీఐ ఆత్మకూరు శాఖ లాకర్‌లో భద్రపరిచినట్లు ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, ఛైర్మన్ జి. గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జాతర నిర్వహణకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతర అమావాస్య వరకు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.

News November 17, 2025

సిద్దపేట: ప్రతి శనివారం సీపీతో ‘ఫోన్-ఇన్’

image

ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సమస్యలు స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి శనివారం ‘పోలీస్ కమిషనర్ తో ఫోన్-ఇన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. సమస్యలు, ముఖ్యమైన అంశాలపై నేరుగా కమిషనర్‌తో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ప్రజలు 8712667100, 8712667306, 8712667371 నంబర్లకు ఫోన్ చేయాలని సీపీ సూచించారు.

News November 17, 2025

హనుమకొండ: కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో దాస్యం భేటీ

image

కెప్టెన్ లక్ష్మీకాంతరావుతో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, మాజీ జడ్పీ ఛైర్మన్ సుధీర్ కుమార్ భేటీ అయ్యారు. జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు ముచ్చటించి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నేతలు పులి రజనీకాంత్, తదితరులు పాల్గొన్నారు.