News July 4, 2024
రాయపోల్: సిడితల వీరగల్లు విగ్రహాం లభ్యం
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం పురాతన గణపతి ఆలయంలో చోళుల కాలం నాటి సిడితల వీరమల్లు విగ్రహం లభ్యమైంది. తల నరుక్కుంటే శైవ సన్నిధికి వెళ్తామనే నమ్మకం అప్పట్లో రాష్ట్ర కూటుల సమయంలో ఉండేది. ఆ కాలంలోని శిల్పం తాజాగా బయటపడింది. రాయపోల్, జనగామ జిల్లా లింగంపల్లి, వనపర్తి జిల్లాలో మూడు వీరగల్లు చిత్రాలు బయటపడ్డాయని చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News October 2, 2024
MDK: పల్లెల్లో బతుకమ్మ పండుగ సందడి
ఉమ్మడి మెదక్ జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగ సందడి మొదలైంది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఈరోజు పాఠశాలల్లో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు హాస్టల్ నుంచి స్వగ్రామాలకు వెళ్తుండడంతో రద్దీగా ఏర్పడింది. గ్రామాల్లో బతుకమ్మ పండుగ పురస్కరించుకొని తంగేడు, గునుగు, వివిధ రకాల పూల సేకరణలో నిమగ్నమయ్యారు.
News October 1, 2024
MDK: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!
సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతితోపాటు మాంసాహారం, మందు షాపులు బంద్ కానున్నాయి. దీంతో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రజలు పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని అంటున్నారట.
News October 1, 2024
MDK: డీఎస్సీలో సత్తా చాటిన అభ్యర్థులు
సోమవారం విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి మెదక్ అభ్యర్థులు సత్తా చాటారు. చిలపిచెడ్ మండలం రహీంగూడకు చెందిన జూల లింగం(SGT), అక్కన్నపేటకు చెందిన జంగం నవీన్( ఫిజికల్ సైన్స్) మెదక్ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. హత్నూర మండలం కాసాలకు చెందిన పన్యాల సాయికృష్ణ SGT సాంఘిక శాస్త్రంలో జిల్లాలోనే 2వ ర్యాంక్ సాధించగా.. అక్కన్నపేటకు చెందిన శ్రీధర్ గౌడ్ అనే యువకుడు(సాంఘిక శాస్త్రం) ఆరో ర్యాంకు సాధించారు.