News March 1, 2025

రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యం: లోకేష్

image

రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శనివారం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాల్లో మంత్రి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వలసల అధికంగా కొనసాగుతున్నాయని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Similar News

News March 3, 2025

శ్రీలేఖ పాడె మోసిన కర్నూలు డీఈవో

image

సీ.బెలగల్ మండలం పోలకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి శ్రీలేఖ కర్నూలులో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. గోనెగండ్ల మండలం పెద్దనెలటూరులో జరిగిన విద్యార్థిని అంత్యక్రియలలో ఈడీవో శ్యామ్యూల్ పాల్ పాల్గొని, పాడెమోశారు. అంత్యక్రియలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు. కాగా, సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో విద్యార్థినిపై చెట్టు విరిగిపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

News March 3, 2025

కేంద్ర రైల్వే మంత్రికి రాఘవేంద్ర ప్రతిష్ఠ అవార్డు ప్రదానం

image

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి గురువు వైభవోత్సవాలు పురస్కరించుకొని ఆదివారం రాఘవేంద్ర స్వామి ప్రతిష్ఠ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగానే కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమన్నకు అవార్డును అందజేశారు. కేంద్ర మంత్రికి అవార్డుతో పాటు రాఘవేంద్ర స్వామి ప్రశంసా పత్రం, జ్ఞాపికను ఇచ్చి శాలువాలతో సత్కరించారు. అనతంరం ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.

News March 2, 2025

కర్నూలు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

➤ నందవరంలో అత్తింటి వేధింపులతో మహిళ సూసైడ్
➤ సీ.బెళగల్ మండలంలో చెట్టు విరిగి పడి బాలిక మృతి
➤ పెద్దకడబూరు: రైతులకు కూటమి ప్రభుత్వం మరోసారి వెన్నుపోటు
➤ బడ్జెట్‌పై ఆలూరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ కర్ణాటకలో జల చౌర్యంపై స్పందించిన కర్నూలు ఎంపీ
➤ కేంద్ర రైల్వే మంత్రికి ప్రతిష్ఠ అవార్డు ప్రదానం

error: Content is protected !!