News June 15, 2024

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి: తులసిరెడ్డి

image

రాయలసీమలో హైకోర్టు కానీ, హైకోర్టు బెంచి కానీ ఏర్పాటు చేయాలని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డా.తులసి రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని, హైకోర్టు రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఒప్పందాన్ని అనుసరించి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని రాయలసీమ, హైకోర్టు కోస్తాలో ఏర్పాటు చేశారన్నారు.

Similar News

News October 3, 2024

ఓటర్ల ప్రత్యేక జాబితాను సిద్ధం చేస్తున్నాం: కలెక్టర్‌

image

కడప ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా – 2025ను ఎలాంటి పెండింగ్‌ లేకుండా సిద్ధం చేస్తున్నామని కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌కు తెలిపారు.
హౌస్‌టు హౌస్‌ ఓటర్ల సర్వే ప్రక్రియ జిల్లాలో 99.45 పూర్తయిందని చెప్పారు. ఫారం-6 ఫారం-7, ఫారం-8 సంబంధించి 01 జనవరి 2023 నుంచి 25 ఏప్రిల్‌ 2024 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

News October 2, 2024

కడప: కేంద్ర కారాగారాన్ని సందర్శించిన కలెక్టర్

image

కడప జిల్లా కేంద్ర కారాగారాన్ని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ సందర్శించారు. గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జైలు జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరూ క్షణిక ఆవేశంలో తప్పులు చేసి ఉంటారని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జైలు జీవితం గడిపేవారు విడుదల అయిన తర్వాత మంచి జీవితాన్ని గడపాలని సూచించారు.

News October 2, 2024

సిద్దవటం: పెన్నా నదిలో పడి బాలుడు మృతి

image

సిద్దవటంలోని పెన్నా నదిలో బుధవారం పుల్లంపేట గ్రామానికి చెందిన ఇస్మాయిల్ (6) అనే బాలుడు ప్రమాదశాత్తు నీట మునిగి మృతి చెందాడు. తన బంధువులతో కలసి విహారయాత్రకు వచ్చిన ఇస్మాయిల్ ప్రమాదశాత్తు నీట మునిగాడు. ఒంటిమిట్ట సీఐ కృష్ణంరాజు నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని ఈతగాళ్ల సాయంతో బాలుడిని బయటికి తీసుకొచ్చారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.