News April 15, 2025

రాయవరం: కొడుకు మృతి.. తల్లడిల్లిన తల్లి హృదయం

image

తల్లిదండ్రులు కుమారుడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పదో తరగతి పరీక్షలు రాసిన కుమారుడి ఫలితం కోసం చూస్తున్నారు. అంతలోనే కొడుకు మరణ వార్తతో షాకయ్యారు. సోమేశ్వరం పరధిలో జరిగిన ప్రమాదంలో సందీప్ మృతి చెందిన విషయం తెలిసిందే. కుమారుడి మృతదేహం వద్ద తల్లి ఆర్తనాధాలు అక్కడ ఉన్నవారిని కలిచివేశాయి. ఒక్కగానొక్క కుమారుడు దూరం కావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు.

Similar News

News October 30, 2025

ముంపు గ్రామాల్లో పంటల పరిస్థితి తెలుసుకున్న కలెక్టర్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో మడ్డువలస డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి గురువారం రేగిడి మండలం సంకిలి బ్రిడ్జి వద్ద నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించారు. ముంపు ప్రభావిత గ్రామాల్లో పంటల నష్టం, ప్రజల స్థితిగతులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.

News October 30, 2025

రేపు అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం!

image

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.15గంటలకు రాజ్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులకు ఆహ్వాన లేఖలు అందినట్లు సమాచారం.

News October 30, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. GVMCకి రూ.8.07 కోట్ల నష్టం!

image

మెుంథా తుఫాన్ కారణంగా EPDCL పరిధిలోని 11 సర్కిళ్లలో రూ.10.47 కోట్ల నష్టం సంభవించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రధానంగా కోనసీమ, కాకినాడ, పశ్చి గోదావరి సర్కిళ్లలో ఎక్కువ నష్టం జరిగినట్టు పేర్కొంది. తుఫాన్ కారణంగా GVMC పరిధిలో రూ.8.07 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. రోడ్లు, డ్రైనేజీ ధ్వంసం, తీరప్రాంతంలో కోత గురవడం వంటివి జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇచ్చారు.