News March 25, 2025

రాయికల్: అక్రమ ఆయుధం విక్రయ యత్నం.. పట్టుకున్న పోలీసులు

image

అక్రమ ఆయుధాన్ని విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు SI సుధీర్ రావు తెలిపారు. SI వివరాలిలా.. UP కి చెందిన పవన్, సునీల్ లు రాయికల్ (m) బషీర్ పల్లెలో ఉంటూ లేబర్ పని చేస్తూ బతుకుతున్నారు. వారు UP నుండి అక్రమంగా ఒక తపంచా తెచ్చారు. సునీల్ తపంచాను అమ్మమని పవన్‌కు ఇచ్చి వెళ్ళాడు. పవన్ రామాజీపేటలో నేడు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా తపంచా, లైన్ రౌండ్ పట్టుకొని సీజ్ చేశారు.

Similar News

News December 1, 2025

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం

image

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జిని MP శ్రీభరత్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పిలా శ్రీనివాసరావు, MLA వెలగపూడి, VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో సురక్షితమైన పద్ధతిలో ఈ వంతెన నిర్మించినట్లు ప్రణవ్‌ వివరించారు. త్వరలోనే త్రిశూల్ ప్రాజెక్ట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

News December 1, 2025

జిల్లాలో 2,28,968 మందికి రూ. 98.91 కోట్లు పంపిణీ: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందజేస్తోందని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. విజయవాడ గులాబీతోటలో సోమవారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, లబ్ధిదారులతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. జిల్లాలో 2,28,968 మందికి రూ. 98.91 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పారదర్శకతతో పథకాలను అమలు చేస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 1, 2025

ఎయిడ్స్‌పై అవగాహన అత్యంత అవసరం: కలెక్టర్

image

వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్‌పై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, ముందస్తు జాగ్రత్తలు, సరైన సమాచారంతోనే వ్యాధిని నిరోధించగలమని పేర్కొన్నారు.