News March 25, 2025
రాయికల్: అక్రమ ఆయుధం విక్రయ యత్నం.. పట్టుకున్న పోలీసులు

అక్రమ ఆయుధాన్ని విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు SI సుధీర్ రావు తెలిపారు. SI వివరాలిలా.. UP కి చెందిన పవన్, సునీల్ లు రాయికల్ (m) బషీర్ పల్లెలో ఉంటూ లేబర్ పని చేస్తూ బతుకుతున్నారు. వారు UP నుండి అక్రమంగా ఒక తపంచా తెచ్చారు. సునీల్ తపంచాను అమ్మమని పవన్కు ఇచ్చి వెళ్ళాడు. పవన్ రామాజీపేటలో నేడు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా తపంచా, లైన్ రౌండ్ పట్టుకొని సీజ్ చేశారు.
Similar News
News April 2, 2025
జనగామ: చికిత్స పొందుతూ మహిళ మృతి

పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కవిత(40) మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 2, 2025
నిజామాబాద్ జిల్లా ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం ఎడపల్లిలో 39.6℃, మంచిప్ప, గోపన్నపల్లి, నిజామాబాద్, కోటగిరి 39.5, మదనపల్లి, చిన్న మావంది 39.4, మల్కాపూర్ 39.3, పెర్కిట్, మోస్రా 39.2, సాలూరా 39.1, రెంజల్, కల్దుర్కి 38.7, వేల్పూర్, వెంపల్లె 38.6, లక్మాపూర్, చింతలకొండూర్, ముప్కల్, యర్గట్ల 38.4, చందూర్, బాల్కొండ 38.3, పోతంగల్ 38, జక్రాన్పల్లి, రుద్రూర్, జకోరా 37.8℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News April 2, 2025
NLG: కేవీలో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

నల్గొండలోని కేంద్రియ విద్యాలయంలో 2 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. దరఖాస్తులను కేంద్రియ విద్యాలయ కార్యాలయంలో బుధవారం ఉదయం 9 నుంచి 12 వదకు పొందాలని పేర్కొన్నారు. పూరించిన దరఖాస్తులను ఈ నెల 11లోగా విద్యాలయంలో అందజేయాలన్నారు. టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కేంద్రియ నిబంధనల ప్రకారం అర్హత ఉంటుందని తెలిపారు.