News March 22, 2025

రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లాలో లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్న వారు రుసుము చెల్లించి.. రాయితీని పొందుతూ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించిన దరఖాస్తు దారులకు 25 శాతం రాయితీనిస్తూ, వెంటవెంటనే భూమి క్రమబద్ధీకరణ చేస్తున్నారన్నారు.

Similar News

News November 16, 2025

నగరంలో ఏటా సుమారు 3 వేల యాక్సిడెంట్స్!

image

HYDలో ఏటా స‌గ‌టున 3 వేల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయని, ఈ ప్ర‌మాదాల్లో 300 వ‌ర‌కు దుర్మరణం చెందుతున్నారని CP సజ్జనార్ అన్నారు. ఎల్బీస్టేడియంలో రోడ్ సేఫ్టీపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు త‌ల‌పెట్టిన ARRIVE ALIVE కార్య‌క్ర‌మాన్ని డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డితో పోస్టర్ ఆవిష్కరించారు. రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ అనేది ప్ర‌తి ఒక్కరు సామాజిక బాధ్య‌త‌లాగా తీసుకోవాలన్నారు.

News November 16, 2025

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో షీ క్యాబ్స్

image

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వద్ద దిగితే, అక్కడ నుంచి నగరానికి వెళ్లేందుకు ఇక మహిళలకు చాలా ఈజీ. ఏలాంటి భయం లేకుండా ఈజీగా ప్రయాణించవచ్చు. రాత్రింబవళ్లు 10 షీ క్యాబ్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ సేవలను సుశిక్తులైన డ్రైవర్లు కండిషన్ క్యాబ్లతో కొనసాగిస్తున్నట్లు RGIA ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

News November 16, 2025

MBNR: రైల్వే ప్రతిపాదనలకు పచ్చజెండా

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖకు పంపించారు. స్పందించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు కురుమూర్తిలో ప్లాట్‌ఫాం ఎత్తు పెంపు, గద్వాలలో రైళ్ల నిలుపుదల, ఫుట్‌ ఓవర్ బ్రిడ్జి తదితర పనులు చేపట్టాలని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మరికల్ మండలం పెద్దచింతకుంట వద్ద ఆర్‌యూబీ వద్ద రోడ్డు మరమ్మతులు చేపట్టనున్నట్లు వివరించారు.