News January 29, 2025
రావి ఆకులపై పద్మ అవార్డు గ్రహీత చిత్రాలు

నారాయణఖేడ్కు చెందిన లీఫ్ ఆర్టిస్టు గుండు శివకుమార్ పద్మ అవార్డు గ్రహీతలకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధి నిపుణులు డా.నాగేశ్వర్ రెడ్డి, చలనచిత్ర నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మ విభూషణ్ రాగా, తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగకు పద్మ అవార్డు లభించగా వారి చిత్రాలను రావి ఆకులపై వేసి శివ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 21, 2025
సంగారెడ్డి: 22న జాబ్ మేళా

సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 22న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల గురువారం తెలిపారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో లైఫ్ మిత్ర ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 79815 71883 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
News November 21, 2025
SRPT: గ్రంథాలయాలు వెలుతురునిచ్చే కేంద్రాలు: కలెక్టర్

గ్రంథాలయాలు జీవితానికి వెలుతురునిస్తూ, భవిష్యత్తుకు దారి చూపెట్టేవి అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువత వాటిని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు
News November 21, 2025
SRPT: గ్రంథాలయాలు వెలుతురునిచ్చే కేంద్రాలు: కలెక్టర్

గ్రంథాలయాలు జీవితానికి వెలుతురునిస్తూ, భవిష్యత్తుకు దారి చూపెట్టేవి అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువత వాటిని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు


