News March 30, 2025
రావులపాలెం వాసికి ఉగాది పురస్కారం

రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఉగాది పురస్కారానికి రావులపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ టీటీడీ వేద పండితుడు పెడసనగంటి సీతారామమూర్తి శర్మ అవధాని ఎంపికయ్యారు. అవధానం విభాగంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి ఆయనను ఎంపిక చేసినట్టు అధికారుల నుంచి ఆహ్వానం అందుకున్నారు. ఆదివారం విజయవాడలో జరిగే శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఈ పురస్కారాన్ని స్వీకరించేందుకు వెళ్తున్నట్టు అవధాని తెలిపారు.
Similar News
News November 1, 2025
మైనారిటీలకు ఫ్రీగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్

AP: మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. త్వరలో క్లాసులు ప్రారంభం అవుతాయన్నారు. అభ్యర్థులు తమ వివరాలను <
News November 1, 2025
చిత్తూరు: CKబాబు కేసులో తప్పించుకున్నా..!

ఇంజినీరింగ్ చదివిన చింటూ చిత్తూరులో బలమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా ఎదిగాడు. బెదిరింపులు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం, హత్యాయత్నం తదితర కేసులు అతనిపై ఉన్నాయి. బంగారుపాళ్యం, కర్ణాటకలో సైతం కేసులు ఉండటంతో చింటూపై రౌడీషీట్ తెరిచారు. మాజీ MLA సీకేబాబుపై హత్యాయత్నం కేసులో చింటూ అరెస్ట్ కాగా.. నేరం నిరూపణ కాలేదు. ఆ కేసులో క్లియరెన్స్ వచ్చింది. మేయర్ హత్య కేసులో మాత్రం ఉరిశిక్ష పడింది.
News November 1, 2025
అదునులో పొదలో చల్లినా పండుతుంది

సక్రమంగా వర్షాలు కురిసి, నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. ఒకవేళ నేలమీద పొదలు అడ్డమున్నా ఆ పొదల నుంచి జారి నేలమీద పడ్డ గింజలు నేల అదునుగా ఉంటే పండితీరుతాయి. అలాగే సమయం, సందర్భం కలిసొచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయం తప్పక లభిస్తుందని తెలియజెప్పే సందర్భాలలో దీన్ని ఉపయోగిస్తారు.


