News June 18, 2024

రాష్ట్రంలోని ఆలయాల పూర్వవైభవానికి కృషి: మంత్రి ఆనం

image

రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి ఆలయాల పూర్వవైభవానికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు సంతపేటలోని మంత్రి నివాసంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక శతాబ్ధాల చరిత్ర గల ఆలయాలు ఎన్నో ఉన్నాయని, వీటి అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు.

Similar News

News November 3, 2025

తుప్పు పడుతున్న సబ్ మిషన్ ప్రాజెక్ట పరికరాలు

image

ఉదయగిరి మండలంలోని గండిపాలెం జలాశయ సమీపంలో సుమారు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ టెక్నాలజీ సబ్మిషన్ ప్రాజెక్ట్ మంచినీటి పథక యంత్ర పరికరాలు తుప్పుపడుతున్నాయి. దీంతో ఫ్లోరిన్ రహిత తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం ప్రజలు వాటర్ ప్లాంట్లపై ఆధారపడి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్వందించాలని కోరుతున్నారు.

News November 2, 2025

మైపాడు బీచ్‌లో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మృతి

image

మైపాడు బీచ్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. బీచ్‌లో స్నానానికి దిగి ఇంటర్ విద్యార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హుమయూన్, తాజిన్, ఆదిల్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 2, 2025

గొలగముడి: లడ్డూ కౌంటర్ 10 గంటలకు ముందే క్లోజ్

image

వెంకటాచలం మండలం గొలగముడి వెంకయ్య స్వామి గుడికి జిల్లాలోనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడకు ఒక్క శనివారమే సుమారు 10 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ భక్తులు ఎంతో భక్తితో తీసుకొనే లడ్డూ ప్రసాదం అందరికి అందడం లేదు. కనీసం రాత్రి 10 గంటలు కాకముందే కౌంటర్ మూసేశారు. దీంతో భక్తులు ప్రసాదం తీసుకోకుండానే నిరాశ చెందుతున్నారు. పలుమార్లు ఇలానే జరుగుతుందని భక్తులు వాపోతున్నారు.