News February 4, 2025

రాష్ట్రంలోనే అతిచిన్న మండల పరిషత్‌గా అమీన్‌పూర్

image

రాష్ట్రంలోనే అతిచిన్న మండల పరిషత్‌గా అమీన్‌పూర్ నిలిచింది. రెండు గ్రామ పంచాయతీలతో మండల పరిషత్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలోని వడక్‌పల్లిలో 820 ఓట్లతో మూడు ఎంపీటీసీ, జానకంపేట 640 ఓట్లతో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా 6 పంచాయతీలను అమీన్‌పూర్ మున్సిపాలిటీలో విలీనం చేశారు.

Similar News

News October 16, 2025

ఓటర్ ఐడీలు తపాల శాఖ ద్వారా అందించాలి: ASF కలెక్టర్

image

నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి కార్యాలయం నుంచి ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.

News October 16, 2025

AI విమాన ప్రమాదంపై న్యాయ విచారణకు సుప్రీంలో పిటిషన్

image

అహ్మదాబాద్‌లో 260 మందికి పైగా మరణించిన AI విమాన ప్రమాదంపై న్యాయ విచారణకు ఆ ఫ్లైట్ కెప్టెన్ సుమీత్ తండ్రి పుష్కర్ సభర్వాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. AAIB దర్యాప్తు సరిగా లేదని, పైలెట్ల లోపం వల్లే ప్రమాదం అన్న రీతిలో దాని ప్రాథమిక నివేదిక ఉందని తప్పుబట్టారు. ఆ దర్యాప్తును నిలిపి, న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో నిపుణులతో స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. ఆయనతో పాటు FIP కూడా కోర్టులో పిటిషన్ వేసింది.

News October 16, 2025

గద్వాల: ‘తెలంగాణ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి’

image

పుదుచ్చెరి మాజీ సీఎం నారాయణస్వామి ఈరోజు గద్వాలను సందర్శించారు. సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు మోహన్‌రావు ఆయనకు వినతిపత్రం అందజేశారు. విద్య, ఉపాధి, మౌలిక వసతుల పరంగా గద్వాల, అలంపూర్‌ ప్రాంతాలు వెనుకబడ్డాయని తెలిపారు. గతంలో రాయచూర్ పరిధిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్‌మెంట్ బోర్డు ద్వారా అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ఈ విజ్ఞప్తిని సీఎం రేవంత్ రెడ్డికి చేరుస్తానని ఆయన హామీ ఇచ్చారు.