News August 28, 2024
రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్..!

బేగంబజార్లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన స్థలాలకు డిమాండ్ విపరీతంగా ఉంటోంది. కొన్నిచోట్ల భూమి అందుబాటులో లేకపోవడంతో పాత భవనాలను కూల్చి కొత్త వాటిని నిర్మిస్తుండటం గమనార్హం. ఇటీవల ఫీల్ఖానాలోని 101 గజాల స్థలం రూ.10 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా తెలంగాణలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా బేగంబజార్ నిలిచిందని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు.
Similar News
News November 17, 2025
హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.
News November 17, 2025
హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.
News November 17, 2025
గ్రేటర్ చెరువులకు హైడ్రా అండ.. త్వరలో బాధ్యతలు ?

మహానగరంలో పలు చెరువులు కబ్జా కావడంతో వాటిని పరిరక్షించేందుకు హైడ్రా నడుంబిగించింది. ఈ క్రమంలో చెరువుల బాధ్యతను మొత్తం హైడ్రాకు అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. చెరువులను కాపాడటంతో పాటు అభివృద్ధి కూడా హైడ్రా చేతుల్లో పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. GHMCలో చెరువుల పరిరక్షణకు సిబ్బంది సమస్య ఉండటంతో ఈ ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఇద్దరు కమిషనర్లు సమావేశం కానున్నట్లు తెలిసింది.


