News March 20, 2025
రాష్ట్రంలోనే జమ్మికుంట, హుజూరాబాద్ టాప్

ఇంటిపన్ను వసూళ్లలో హుజూరాబాద్ మున్సిపాలిటీ 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ 100% లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ అయాజ్ పేర్కొన్నారు. ఈ ఘనత మున్సిపల్ ప్రజలు, సిబ్బంది వల్లే సాధ్యమైందని ఇరువురు తెలిపారు.
Similar News
News April 20, 2025
లక్ష్మణచాంద: వాగులో బాలుడి మృతదేహం లభ్యం

లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల రాంచరణ్ (14)అనే బాలుడి మృతదేహం స్థానిక వాగులో ఆదివారం లభ్యమైంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రాంచరణ్ రోజూ లాగే శనివారం మధ్యాహ్నం దోస్తులతో కలిసి వాగులో స్నానం చేయటానికి వెళ్లాడు. ఎస్సారెస్పీ కెనాల్ ప్రవహిస్తున్న కారణంగా వాగులో నీటి ఉద్ధృతి పెరిగి రాంచరణ్ నీటిలో మునిగిపోయి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 20, 2025
విమానాన్ని ఢీకొట్టిన టెంపో వ్యాన్!

బెంగళూరు ఎయిర్పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
News April 20, 2025
ప్రైవేట్ స్కూల్లో ప్రవేశం పొందవచ్చు: అల్లూరి డీఈవో

అభాగ్యులు, అనాధ పిల్లలు ఇకపై నేరుగా మీకు దగ్గరలో గల ఏ ప్రైవేట్ పాఠశాలలో (cbse, స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న ) అయినా 1వ తరగతిలో ప్రవేశం పొందవచ్చని అల్లూరి DEO బ్రహ్మాజీరావు ఆదివారం తెలిపారు. ఈ మేరకు 25% కోటా కేటాయించాలని అన్ని ప్రైవేట్ స్కూల్స్కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈనెల 28 నుంచి మే 15 తేదీలోగా https://cse.ap.gov.in ద్వారా online దరఖాస్తు చేసుకొని బడిలో చేరాలన్నారు.