News September 20, 2024

రాష్ట్రంలో జిల్లాను ఆదర్శంగా నిలబెట్టాలి: సిక్తా పట్నాయక్

image

విద్యలో జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలబెట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కేజీబీవీ పాఠశాలలో నోడల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపి వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వాటిని సక్రమంగా అమలు చేయాలని అన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు.

Similar News

News September 20, 2024

రూ. 4.60 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ

image

భారీ గణనాథుడి లడ్డుకు రికార్డు ధర పలికింది. గురువారం రాత్రి ఆత్మకూరు పట్టణంలోని బీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహా వినాయకుడి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వేలంపాటలో గణేశుడి చేతిలోని లడ్డు ప్రసాదాన్ని మాజీ వార్డు సభ్యులు గడ్డమీది శ్రీనివాసులు రూ. 4.60 లక్షలకు దక్కించుకున్నారు. అనంతరం వేలాది మంది భక్తులు ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది.

News September 19, 2024

శ్రీశైలం డ్యాం తాజా సమాచారం..

image

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 880.6 అడుగుల వద్ద 191.2118 టీఎంసీలుగా ఉంది. ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల ద్వారా మొత్తంగా జలాశయానికి 21,879 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. భూగర్భ కేంద్రం, ఏపీ జెన్కో పరిధిలో విద్యుత్ ఉత్పత్తికి మొత్తం 67,156 క్యూసెక్కుల నీటిని వినియో గిస్తున్నారు. భూగర్భ కేంద్రంలో 16.879 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 14.697 మి.యూనిట్లు ఉత్పత్తి చేశారు.

News September 19, 2024

జూరాలకు స్వల్ప వరద

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో అతి స్వల్పంగా ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రానికి 18, 500 క్యూసెక్కులు మాత్రమే ఉన్నట్లు వివరించారు. విద్యుత్ ఉత్పత్తికి 15,120 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 18,385 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.583 టీఎంసీల నీరు నిల్వ ఉంది.