News February 27, 2026

రాష్ట్రంలో పరువు హత్య.. దారుణంగా చంపేశారు

image

AP: తూ.గో జిల్లా ద్వారపూడిలో పరువు హత్య కలకలం రేపింది. రాయవరం డిప్యూటీ తహశీల్దార్ సంధ్య(40), ద్వారపూడికి చెందిన సూర్యప్రకాశ్ రావు(41) నిన్న ఉదయం అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో సంధ్య సోదరులు ద్వారపూడి వెళ్లి బైక్‌పై వస్తున్న నూతన దంపతులను అడ్డుకున్నారు. ఆగ్రహంతో సూర్యప్రకాశ్‌ను రాళ్లతో కొట్టి చంపేశారు. తర్వాత స్థానికులు నిందితులను చితకబాది, పోలీసులకు అప్పగించారు.

Similar News

News April 20, 2026

హనుమకొండలో విద్యార్థినిపై దారుణం.. వీడియో వైరల్

image

హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని ఓ కళాశాలలో విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. ఇంటర్ చదువుతున్న జూనియర్ విద్యార్థినిని అదే కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థి మోసం చేసి, స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. బట్టలు విప్పించి వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.

News April 20, 2026

రహానే చెత్త రికార్డు

image

నిన్న RRతో మ్యాచులో సున్నాకే ఔటైన KKR కెప్టెన్ రహానే IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఓపెనర్‌గా అత్యధిక సార్లు(12) డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పార్థివ్ పటేల్(11), శిఖర్(10), గంభీర్(10), వార్నర్(9) ఉన్నారు. ఓవరాల్‌(బ్యాటింగ్ పొజిషన్‌తో సంబంధం లేకుండా)గా మ్యాక్స్‌వెల్(19) టాప్‌లో ఉన్నారు. కాగా సీజన్‌లో రహానే 7 మ్యాచుల్లో 25.33 యావరేజ్‌తో 152 రన్స్ చేశారు.

News April 20, 2026

అమానుషం.. కన్నపిల్లల్నే కాల్చి చంపాడు!

image

అమెరికాలోని లూసియానా కాల్పుల <<19693285>>కేసులో<<>> హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు కాల్చి చంపిన ఎనిమిది మంది పిల్లల్లో ఏడుగురు కన్నబిడ్డలే ఉన్నారు. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. భార్య, మరో మహిళపైనా నిందితుడు కాల్పులు జరపగా వారి పరిస్థితి విషమంగా ఉంది. 2024 జనవరి తర్వాత USలో ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. పోలీసుల కాల్పుల్లో నిందితుడు చనిపోగా ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.