News July 18, 2024

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం: గుడివాడ

image

APలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా రోడ్లమీద తిరిగే పరిస్థితి లేదన్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కూటమి శ్రేణులు చేస్తున్న దమనకాండ రోజురోజుకు మితిమీరిపోతుందన్నారు. దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయిందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 21, 2025

జీవీఎంసీ సర్వసభ్య సమావేశంలో 131 అంశాలు ఆమోదం

image

జీవీఎంసీ సర్వసభ్య సమావేశం శుక్రవారం జీవీఎంసీ కౌన్సిల్ హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో 131 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అజెండాలలో గల 132 అంశాలను చర్చించి 131అంశాలు ఆమోదించగా, రెల్లివీధి పేరు మార్పు అంశాన్ని తిరస్కరించడమైనదని మేయర్ తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జీవీఎంసీ అధికారులు కౌన్సిల్ హాల్‌లో ఉన్నారు.

News November 21, 2025

విశాఖ సిటీ పరిధిలో నలుగురు ఎస్ఐల బదిలీ: సీపీ

image

విశాఖ సిటీ పరిధిలో 4గురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ విశాఖ సీపీ శంక బ్రత బాగ్చి శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. దువ్వాడ L&O ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ద్వారాక క్రైమ్‌కు, త్రీటౌన్ L&O ఎస్‌ఐ సంతోష్‌ను ద్వారక L&Oకు, ద్వారక క్రైమ్ ఎస్‌ఐ రాజును త్రీటౌన్ L&Oకు, ద్వారక L&O ఎస్‌ఐ ధర్మేంద్రను దువ్వాడ L&Oకు బదిలీ చేశారు.

News November 21, 2025

విశాఖ: యాంటీ బయోటిక్స్ వాడుతున్నారా?

image

విశాఖ DMHO కార్యాలయం వద్ద శుక్రవారం యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్ ర్యాలీ నిర్వహించారు. DMHO జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. యాంటీ బయోటిక్స్‌ను అనవసరంగా వాడటం వలన డ్రగ్ రెసిస్టన్స్ పెరుగుతుందన్నారు. డాక్టర్స్ సలహాల మేరకే యాంటీ బయోటిక్స్ వాడాలన్నారు. డాక్టర్స్ సలహా లేకుండా యాంటీ బయోటిక్స్‌ను వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హెల్త్ సిబ్బంది ప్రజలకు ఈ విషయాన్ని తెలియచేయాలన్నారు.