News March 20, 2025

రాష్ట్రంలో 26 సైబర్ పోలీస్ స్టేషన్లు: హోం మంత్రి

image

రాష్ట్రంలో కొత్తగా 26 సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధం చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో కనీసం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న 277 మంది సీఐలను డీఎస్పీలుగా ప్రమోషన్ కల్పించాల్సి ఉందన్నారు.

Similar News

News March 22, 2025

KMR: ఈ నెల 31 వరకు దరఖాస్తులక అవకాశం

image

ప్రధాని మంత్రి ఇంటర్న్ షిప్ పథకానికి దేశంలోని 500 పైచిలుకు కంపెనీల్లో ఇంటర్న్‌లుగా చేరి పని అనుభవాన్ని గడిచే అవకాశం ఈ పథకం ద్వారా యువతకు లభిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఇప్పటికే ముగిసినా కేంద్రం యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

News March 22, 2025

వనపర్తి జిల్లా కలెక్టర్ WARNING

image

అనుమతిలేని, అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 31 వరకు ఎల్.ఆర్.ఎస్ క్రమబద్ధీకరణ చేయించుకునే వారికి 25 శాతం రాయితీ ఇస్తామన్నారు. గడువు ముగిసిన తర్వాత అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

News March 22, 2025

KMR: ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీపై విస్తృత ప్రచారం: కలెక్టర్

image

ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీపై విస్తృత ప్రచారం చేస్తున్నామని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. LRS పై రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి దాన కిషోర్ కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు దారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నామని, ఈ నెల 31 వరకు 25% రాయితీ వర్తిస్తుందని ప్రజలకు వివరిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

error: Content is protected !!