News February 10, 2025
రాష్ట్రంలో 60 శాతం అల్లూరి జిల్లా వాటా: కలెక్టర్

గిరిజన రైతులు పండిస్తున్న సంప్రదాయ దేశీయ పసుపు సాగును ప్రోత్సహిస్తామని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం తెలిపారు. రాష్ట్రంలో పసుపు సాగులో అల్లూరి సీతారామరాజు జిల్లా 60 శాతం వాటాను ఆక్రమించిందన్నారు. గిరిజన వ్యవసాయ ఉత్పత్తులపై డిల్లీలో చర్చ జరుగుతోందన్నారు. గిరిజన రైతులు సేంద్రియ పసుపును సాగు చేస్తున్నారన్నారు. పసుపు సాగులో గిరిజన రైతులకు మెలకువలపై అవగాహన కల్పిస్తే మంచి దిగుబడులు సాధిస్తారన్నారు.
Similar News
News December 1, 2025
ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన తప్పనిసరి: మన్యం కలెక్టర్

ఎయిడ్స్ వ్యాధి నివారణపై యువత తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురంలోని కలెక్టరేట్లో సోమవారం మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలంటే నివారణ ఒక్కటే మార్గమని, వ్యాధిగ్రస్తులను చులకనగా చూడొద్దన్నారు. వ్యాధి సోకిన వారు అపోహలు మాని ఆసుపత్రులకు వెళ్లి తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు.
News December 1, 2025
హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CBN

AP: విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు(D) నల్లమాడులో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన అక్కడి సభలో మాట్లాడారు. ‘94% స్ట్రైక్ రేట్తో గెలిపించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News December 1, 2025
HYD: కరెంటు బిల్లే క్రెడిట్ స్కోరు.!

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ప్రభుత్వం కీలక ఆర్థిక సంస్కరణను ప్రకటించనుంది. ‘రుణ చరిత్ర లేని’ ప్రజల కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB) ఏర్పాటు కానుంది. ఈ సంస్థ కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు వంటి చెల్లింపుల రికార్డులను పరిశీలించి ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ను ఇస్తుంది. ఈ స్కోరు ఆధారంగా బ్యాంకులు లక్షలాది మందికి రుణాలు అందించే అవకాశం ఉందని అధికారులు Way2Newsకు తెలిపారు.


