News February 10, 2025

రాష్ట్రంలో 60 శాతం అల్లూరి జిల్లా వాటా: కలెక్టర్

image

గిరిజన రైతులు పండిస్తున్న సంప్రదాయ దేశీయ పసుపు సాగును ప్రోత్సహిస్తామని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం తెలిపారు. రాష్ట్రంలో పసుపు సాగులో అల్లూరి సీతారామరాజు జిల్లా 60 శాతం వాటాను ఆక్రమించిందన్నారు. గిరిజన వ్యవసాయ ఉత్పత్తులపై డిల్లీలో చర్చ జరుగుతోందన్నారు. గిరిజన రైతులు సేంద్రియ పసుపును సాగు చేస్తున్నారన్నారు. పసుపు సాగులో గిరిజన రైతులకు మెలకువలపై అవగాహన కల్పిస్తే మంచి దిగుబడులు సాధిస్తారన్నారు.

Similar News

News February 23, 2026

భద్రాద్రి: రూ.80 కోట్లతో నవోదయ విద్యాలయం

image

అశ్వాపురం(M) భీముని గుండం కొత్తూరులో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. మొండికుంట పరిధిలోని 997 సర్వే నంబర్‌లోని 33 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. సుమారు రూ.80 కోట్లతో నిర్మాణ బాధ్యతను NBCCకి అప్పగించారు. ఇటీవల అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించారు. దీని ద్వారా జిల్లా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసతులతో కూడిన విద్య అందుబాటులోకి రానుంది.

News February 23, 2026

BRS ఏపీలోకి వస్తే తొక్కిపడేస్తాం: మంత్రి

image

బీఆర్ఎస్‌పై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిన్న కోనసీమ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీ ఏపీలోకి వస్తే శెట్టిబలిజలంతా కలిసి తొక్కిపడేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో గత సీఎం కేసీఆర్ శెట్టిబలిజలను ఓసీల్లో చేర్చి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇక ఏపీ మాజీ సీఎం జగన్ మానసికంగా ఇబ్బందిపడుతున్నారని, ఆయనకు యోగా ఎంతో అవసరమని వాసంశెట్టి సెటైర్ వేశారు.

News February 23, 2026

విజయవాడలో ప్రజాప్రతినిధుల మధ్య క్రీడా పోరు..!

image

ఇందిరాగాంధీ స్టేడియంలో MLA, MLCలకు ఈ నెల 24 నుంచి 3 రోజులపాటు పలు క్రీడాంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. పరుగు పందెం, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, టెన్నికాయిట్, త్రో బాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్, షాట్‌పుట్, క్యారమ్స్, క్రికెట్, పికిల్ బాల్‌ పోటీలు నిర్వహిస్తామన్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు మ్యూజికల్ ఛైర్ పోటీలు ఉంటాయన్నారు.