News February 10, 2025
రాష్ట్రంలో 60 శాతం అల్లూరి జిల్లా వాటా: కలెక్టర్

గిరిజన రైతులు పండిస్తున్న సంప్రదాయ దేశీయ పసుపు సాగును ప్రోత్సహిస్తామని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం తెలిపారు. రాష్ట్రంలో పసుపు సాగులో అల్లూరి సీతారామరాజు జిల్లా 60 శాతం వాటాను ఆక్రమించిందన్నారు. గిరిజన వ్యవసాయ ఉత్పత్తులపై డిల్లీలో చర్చ జరుగుతోందన్నారు. గిరిజన రైతులు సేంద్రియ పసుపును సాగు చేస్తున్నారన్నారు. పసుపు సాగులో గిరిజన రైతులకు మెలకువలపై అవగాహన కల్పిస్తే మంచి దిగుబడులు సాధిస్తారన్నారు.
Similar News
News February 8, 2026
జొన్నలు ఆహారంగా తీసుకుంటున్నారా?

జొన్నలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇవి శరీర బరువును తగ్గించడమే కాకుండా డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుతాయని అంటున్నారు. అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం తగ్గి, జీర్ణవ్యవస్థ తీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రొట్టె, అంబలి/జావ, కిచిడీ, దోశ/ఇడ్లీ రూపంలో వీటిని తీసుకోవచ్చు.
News February 8, 2026
విజయవాడలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే!

విజయవాడలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 280, స్కిన్ రూ. 270లుగా విక్రయిస్తున్నారు. డిమాండ్ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు సమాచారం. మటన్ కేజీ రూ. 1000లగా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 220లు, 30 కోడిగుడ్లు గతవారం రూ. 165లు ఉండగా నేడు రూ. 153లకు చేరుకుంది. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి
News February 8, 2026
KMR: ఈ నెల 9 నుంచి 14 వరకు సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రదేశాల్లో చీఫ్ మినిస్టర్ కప్-2026 జిల్లా స్థాయి క్రీడలను ఈ నెల 9 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా యూత్&స్పోర్ట్స్ ఆఫీసర్ రంగ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. పలు క్రీడలకు ఇన్ఛార్జ్లను సైతం నియమించారు. ఆయా ప్రదేశాల్లో ఏర్పాటు చేసే క్రీడల వద్ద ప్రాథమిక చికిత్స శిబిరాలను ఏర్పాటు చేయాలని DMHO డా.విద్యను ఆయన కోరారు. సంబంధిత PHC సిబ్బందిని ఆమె నియమించారు.


