News February 18, 2025
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఆసిఫాబాద్ బిడ్డలు

సిర్పూర్ (యు) మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో విద్యార్థులు శ్వేత, నిఖిత, అమూల్య, ప్రభాస్ ఎంపికయ్యారని ప్రిన్సిపల్ మిట్ట వెంకటస్వామి, పీడీ ధర్మారావ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. 34వ రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారని చెప్పారు.
Similar News
News December 7, 2025
వరంగల్: సర్పంచ్కు పోటీ.. 9 మందిది ఒకే ఇంటి పేరు!

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. వీరిలో 9 మంది ఒకే ఇంటి పేరు గల అభ్యర్థులు ఉండడం ఓటర్లకు తలనొప్పిగా మారింది. సీనపెల్లి అనే ఇంటి పేరుతో ఉన్న అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తుండగా, ఇందులో సీనపెల్లి రాజు అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దీంతో ఎన్నికల పోలింగ్ సమయంలో ఎవరికి ఓట్లు పడతాయో అర్థం కానీ పరిస్థితి.
News December 7, 2025
సిద్దిపేట: ఇద్దరు భార్యల నామినేషన్.. పెద్ద భార్య సర్పంచ్

అక్బర్పేట భూంపల్లి మండలం జంగాపల్లి సర్పంచ్ పదవికి నరసింహారెడ్డి ఇద్దరు భార్యలు లావణ్య, రజిత నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు. కాగా చెల్లి రజిత శనివారం తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో అక్క లావణ్య సర్పంచ్గా ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. గ్రామంలో సర్పంచ్తో పాటు 10 వార్డు స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి.
News December 7, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాది పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్వో

స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్యాధికారి దుర్గారావు దొర పిలుపునిచ్చారు. అమలాపురం ఈడబ్ల్యూఎస్ కాలనీలో అవగాహన సదస్సు జరిగింది. డీఎంహెచ్వో మాట్లాడుతూ.. గడ్డి, పొదల్లోకి వెళ్లేటప్పుడు శరీరం కప్పుకునే దుస్తులు ధరించాలని, నేలపై నేరుగా కూర్చోవడం లేదా పడుకోవడం వంటివి చేయకూడదని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధి నివారణ సాధ్యమన్నారు.


