News March 19, 2025
రాష్ట్రస్థాయి పైలట్ ప్రాజెక్టులో కొలనూర్ గ్రామం

ఓదెల మండలంలోని కొలనూర్ గ్రామానికి రైతు గుర్తింపు కార్డుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైనట్టు మండల వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. ప్రభుత్వం ప్రతి రైతుకు రైతు గుర్తింపు కార్డు ఇస్తుందని తెలిపారు అందులో భాగంగా రేపు కొలనూరు రైతువేదికలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు ఆధార్ కార్డు, భూమిపట్టా పాస్బుక్ తీసుకొని రావాలని సూచించారు. భూమి ఉన్న ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు
Similar News
News October 29, 2025
ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లకు తుమ్మల ఫోన్

మొంథా తుపాను తీరం దాటిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన మంత్రి, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా హెచ్చరించాలని, కీలక ఆదేశాలు జారీ చేశారు.
News October 29, 2025
శాతవాహన ఎక్స్ప్రెస్.. జనగాంలో అదనపు స్టాప్

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. శాతవాహన ఎక్స్ప్రెస్ రైలుకు జనగాం స్టేషన్లో అదనపు స్టాప్ ప్రకటించింది. ప్రయోగాత్మకంగా అక్టోబర్ 30, 2025 నుంచి అమల్లోకి రానుంది. విజయవాడ- సికింద్రాబాద్ ఉ.10:14, సికింద్రాబాద్- విజయవాడ సా.17:19కి జనగాం చేరుకొని, నిమిషం పాటు వెయిట్ చేస్తుందని పేర్కొంది.
News October 29, 2025
GNT: 39 మంది గర్భిణులను జీజీహెచ్కు తరలింపు

‘మొంథా’ తుపాను తీవ్ర ప్రభావం నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. సోమవారం, మంగళవారం రోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 39 మంది గర్భిణులను సురక్షితంగా GNT GGHకు తరలించారు. తరలించిన గర్భిణులలో అచ్చంపేట, కారంపూడి, పెదకూరపాడు, దుగ్గిరాల ప్రాంతాలకు చెందిన మహిళలు ఉన్నారు. 24 గంటల విద్యుత్కు అంతరాయం కలగకుండా, 8 జనరేటర్లకు సరిపడా ఇంధనాన్ని సిద్ధం చేశారు.


