News January 22, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు కడప జిల్లా కబడ్డీ జట్లు ఎంపిక

51వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే కడప జిల్లా సీనియర్ విభాగం బాలబాలికల జట్లను బుధవారం ఎంపిక చేశారు. కడప నగరంలోని శివ శివాని హైస్కూల్ మైదానంలో నిర్వహించిన ఈ ఎంపికలను జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, జనార్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు వైజాగ్లో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారన్నారు.
Similar News
News November 26, 2025
కన్నీటి నివాళి: ‘అమ్మే మా వెన్నెముక’

కుటుంబానికి వెన్నెముకగా, జీవితానికి వెలుగుగా నిలిచిన <<18391262>>అమ్మ<<>> రత్నమ్మ (83) ఇక లేరనే నిజాన్ని అంగీకరించడం భారంగా ఉందని ఎంపీ సీఎం రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రేమ, త్యాగం, ఆప్యాయత మాటలతో చెప్పలేనంత గొప్పవని అన్నారు. అమ్మ లేకపోవడం మాటల్లో చెప్పలేని పెద్ద లోటుగా మిగిలిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
News November 26, 2025
ఎంపీ సీఎం రమేశ్ తల్లి మృతి

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ (83) మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున 3.39 గంటలకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలో రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News November 26, 2025
ఎంపీ సీఎం రమేశ్ తల్లి మృతి

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ (83) మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున 3.39 గంటలకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడప జిల్లా పొట్లదుర్తి గ్రామంలో రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


