News October 27, 2024
రాష్ట్రస్థాయి పోటీలకు మంచిర్యాల విద్యార్థులు

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ZPHS బాలుర పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఈశ్వర ప్రసాద్, జోనల్ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు కార్తిక్ ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఈ నెల 28 నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరగనున్నాయి. రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు వచ్చే నెల 2వ తేదీ నుంచి మహబూబాబాద్లో జరగనున్నాయి. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల HM, సిబ్బంది అభినందించారు.
Similar News
News December 9, 2025
ఆదిలాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు మండలాల్లోని 166 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
News December 8, 2025
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు: ADB కలెక్టర్

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ జెడ్పి సమావేశ మందిరంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల స్టేజ్- 2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ పూర్తి చేసి ఫలితాలు T -పోల్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు.
News December 7, 2025
ఆదిలాబాద్: 50 నుంచి 100 మందికి ఓ బాధ్యుడు..!

పంచాయతీ పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది సర్పంచి అభ్యర్థులు ప్రచార జోరు పెంచుతున్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో ఓటర్లు ప్రత్యర్థివైపు వెళ్లకుండా వ్యూహాలు పన్నుతున్నారు. కొన్ని పంచాయతీల్లో 50 నుంచి 100 మంది ఓటర్లకు ఓ బాధ్యున్ని నియమిస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కీలకమైన కుల సంఘాల ఓట్లు దక్కించుకునేందుకు ఆ సంఘంలో చురుకుగా ఉండే వారికి బాధ్యతలు ఇస్తూ ఓట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


