News March 18, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు మంచిర్యాల బిడ్డలు

మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో కోటపల్లి విద్యార్థులు సత్తాచాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పారిపెల్లి సుప్రియ జావలిన్ త్రోలో స్వర్ణం, 8వ విద్యార్థి నాయిని శ్రీనిజ 100, 400 మీటర్ల పరుగు పందెంలో రెండు బంగారు పతకాలు సాధించారు.
Similar News
News December 4, 2025
179 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్లో 179 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, పీజీ, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్లో అనుభవం ఉండాలి. ప్రొఫెసర్కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ.57,700 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://cau.ac.in/
News December 4, 2025
ఉన్నవ లక్ష్మీనారాయణ.. సాహిత్య, సామాజిక విప్లవకారుడు.!

తెలుగు నవలా సాహిత్యానికి కొత్త దిశానిర్దేశం చేసిన ఉన్నవ లక్ష్మీనారాయణ (1877-1958) ఉమ్మడి గుంటూరు జిల్లా వేములూరుపాడులో జన్మించారు. న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా బహుముఖ ప్రజ్ఞ చాటారు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. సామాజిక రుగ్మతలను ఎదిరించి, దళితుల అభ్యున్నతికి ఆయన రాసిన ‘మాలపల్లి’ నవల ఒక విప్లవాత్మక సృష్టి.
News December 4, 2025
దీపం కొండెక్కింది అని ఎందుకు అంటారు?

దీపం ఆరిపోవడాన్ని మనం ‘దీపం కొండెక్కింది’ అని అంటాం. దీని వెనుక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. సాధారణంగా మనం పర్వతాలను దైవ నివాసాలుగా భావిస్తాం. కొండలు దేవతలకు ఆశ్రయం ఇస్తాయని నమ్ముతాం. అయితే, దీపం జ్యోతి ఆరిపోయినప్పుడు, అది భౌతిక దేహాన్ని విడిచి, నేరుగా దైవంలో కలిసిపోయింది అని భావించాలి. దీపం దైవంలో ఐక్యమైందని చెప్పడానికే మనం ఆధ్యాత్మిక వ్యక్తీకరణను ఉపయోగిస్తూ ఇలా చెబుతుంటాం.


