News February 2, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో జన్నారం విద్యార్థిని ప్రతిభ

జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్.అరవిందరాణి రాష్ట్రస్థాయి ఆంగ్ల ఉపన్యాస పోటీల్లో సత్తా చాటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన ఉపన్యాస పోటీలు ఆమె తృతీయ బహుమతి సాధించారని HM రాజన్న తెలిపారు. దీంతో విద్యార్థిని అరవింద రాణిని, గైడ్ టీచర్, ఉపాధ్యాయుడు కమలాకర్ను ఆయన అభినందించారు.
Similar News
News January 6, 2026
MBNR: ట్రాన్స్జెండర్లకు గుడ్ న్యూస్.. APPLY NOW

జిల్లాలోని ట్రాన్స్జెండర్ల ఆర్థిక పునరావాసం కోసం 100% సబ్సిడీతో కూడిన పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి S.జరీనా బేగం తెలిపారు. జిల్లాకు కేటాయించిన ఒక యూనిట్ కింద ముగ్గురు ట్రాన్స్జెండర్లను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీలోగా జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 6, 2026
బంగారు పేపర్లతో భగవద్గీత

కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అపురూపమైన కానుక అందింది. ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు రూ.2 కోట్ల విలువైన బంగారు పేపర్లతో రూపొందించిన స్వర్ణ భగవద్గీతను సమర్పించారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో రూపొందిన ఈ గ్రంథాన్ని విశ్వగీతా పర్యాయ ముగింపు రోజున మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామికి అందజేయనున్నారు. ఈ నెల 8న బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకొచ్చి మఠానికి బహూకరించనున్నారు.
News January 6, 2026
AIలో 83% విద్యార్థులకు ఉద్యోగాలు

TG: IIT హైదరాబాద్లో 62.42% మందికి ఉద్యోగాలు వచ్చినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ BS మూర్తి తెలిపారు. ఈ సారి మొత్తం 487 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 304 మందికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. సగటు వార్షిక ప్యాకేజీ రూ.30 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా AI విభాగంలో 83.3% విద్యార్థులకు ప్లేస్మెంట్స్ రావడం విశేషం. CSE విద్యార్థి ఎడ్వర్డ్ <<18734504>>వర్గీస్<<>>కు రూ.2.5 కోట్ల ప్యాకేజీతో జాబ్ వచ్చింది.


