News February 19, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన సిద్దిపేట క్రీడాకారులు

హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 8వ రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పట్టణానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, ఎనిమిది బ్రోంజ్ మెడల్ పథకాలు సాధించారని జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు నారన్నగారి రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి స్వామి ఉన్నారు.
Similar News
News March 23, 2025
షాద్నగర్లో హాస్టల్పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం

షాద్నగర్ పట్టణంలోని బాలుర హాస్టల్ పైఅంతస్తు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి దూకాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్కి చెందిన చందు ఈరోజు మధ్యాహ్నం బిల్డింగ్ పైనుంచి అకస్మాత్తుగా కిందికి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News March 23, 2025
SRHvRR: టాస్ గెలిచిన RR

ఉప్పల్లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో SRH ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
News March 23, 2025
త్వరలో కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి: సత్యకుమార్ యాదవ్

AP: బలభద్రపురం క్యాన్సర్ కేసులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘<<15850475>>బలభద్రపురం<<>>లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం. ఇంటింటికీ వెళ్లి వైద్యులు సర్వే చేస్తున్నారు. క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నాం. త్వరలో కర్నూలులో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తూ.గో జిల్లా బిక్కవోలు(M) బలభద్రపురంలో 200 మంది క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే.