News December 27, 2024
‘రాష్ట్రానికి క్యూ కడుతున్న దిగ్గజ ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు’
అమరావతి: గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రగతిశీల ఆలోచనలతో గత ఆరునెలల్లో రాష్ట్రంలో ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలను పరుగులు తీయిస్తామని యువనేత నారా లోకేశ్ అన్నారు. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రాన్ని ఐటి హబ్ గా మార్చేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు రప్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు.
Similar News
News January 25, 2025
మంగళగిరి: ఏపీఎస్పీ కానిస్టేబుల్ అదృశ్యం
మంగళగిరి పరిధిలోని ఏపీఎస్పీ 6వబెటాలియన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఆయన భార్య రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు శనివారం లిఖితపూర్వకంగా స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ స్టేషన్ సిబ్బంది తెలిపారు.
News January 24, 2025
నిఘా పెట్టి.. నేరాలు నియంత్రణ చేయాలి: ఎస్పీ
గుంటూరు జిల్లా నేర విభాగం పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఎస్పీ సతీష్ కుమార్ తనిఖీ చేశారు. నేరాల దర్యాప్తు, చోరీకి గురైన సొమ్ము రికవరీ తీరు తదితర అంశాల గురించి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా తగిన నిఘా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జైలు నుంచి వచ్చిన నేరస్తులు, దొంగల కదలికలపై నిఘా పెట్టి నేరాలు జరుగకముందే వాటిని కట్టడి చేయాలన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ సుప్రజ ఉన్నారు.
News January 24, 2025
గుంటూరు: మూడు రోజులు పోలీసు కస్టడీకి తులసి బాబు
RRRను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసి బాబును మూడు రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ శుక్రవారం ఆదేశించారు. నగరంపాలెం పోలీసులు దాఖలు చేసిన ఈ కేసులో ఒంగోలు ఎస్పీ విచారణాధికారి. ఐదు రోజుల కస్టడీకి పిటీషన్ దాఖలు చేయగా, తులసి తరఫు న్యాయవాదులు అందుకు నిరాకరించారు. కేసు పూర్వపరాలు, వాదోపవాదాల అనంతరం మూడు రోజుల కస్టడీకి అనుమతించారు.